బురదలోకి లాగొద్దు: రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ఎట్టకేలకు స్పందించిన వసుంధర రాజే
జైపూర్: గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజస్థాన్ రాజకీయ హైడ్రామాపై ఎట్టకేలకు ఆ రాష్ట మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతికి రాస్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ వివాదాల్లో తనను, తమ పార్టీని లాగొద్దని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
కరోనావైరస్ కారణంగా రాష్ట్రంలో 500 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 28వేల మంది కరోనా బాధితులున్నారని వసుంధర రాజే తెలిపారు. ఇక రాష్ట్రంలో మిడతల సమస్య కూడా ఉందన్నారు. అంతేగాక, రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అన్నారు.

రాష్ట్ర ప్రజలు విద్యుత్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వసుంధర రాజే తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలతో ప్రజలు సతమవుతుంటే.. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ సంక్షోభం అనే బురదలోకి బీజేపీని లాగవద్దని రాజే అన్నారు. బీజీపీ నేతలను లాగాలనుకోవడంలో అర్థం లేదన్నారు. ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజల గురించి ఆలోచించే ప్రయత్నం చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్, ఆయన వర్గం తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టే ప్రయత్నాలను చేశారంటూ ఆడియో క్లిప్పులను కూడా విడుదల చేసింది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications