వ్యాఖ్య: మయాంక్ గాంధీపై రాఖీ సావంత్ ఫిర్యాదు
ముంబై: ఐటం గర్ల్, తన ప్రత్యర్థి రాఖీ సావంత్పై వ్యాఖ్య చేసి ఆమ్ ఆద్మీ పార్టీ లోకసభ అభ్యర్థి మయాంక్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాఖీ సావంత్ మయాంక్ గాంధీపై ఫిర్యాదు చేశారు.
మయాంక్ గాంధీతో పాటు రాఖీ సావంత్ రాష్ట్రీయ ఆమ్ పార్టీ (రాప్) ముంబై నార్త్ వెస్ట్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం కాంగ్రెసుకు చెందిన గురుదాస్ కామత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాఖీకి సీరియస్ ఓటర్లు ఎవరూ ఓటు చేయరని, మజా మార్నే వాలి జనతా మాత్రమే ఓటు వేస్తారని మయాంక్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యపై రాఖీ సావంత్ ఓషివార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తన వ్యాఖ్యను సందర్భం నుంచి విడదీసి చూపించారని గాంధీ అంటున్నారు. సెక్సిస్ట్ రిమార్క్ కాదని, కమాల్ ఆర్ ఖాన్కు లేదా రాఖీ సావంత్కు గానీ సీరియస్ ఓటర్లు ఓటు వేయరని తాను అన్నానని ఆయన వివరించారు.