Ram Mandir Consecration: రామమందిర ప్రాణప్రతిష్టకు క్రతువుల ప్రారంభం-వివరాలివే..

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో శరవేగంగా నిర్మిస్తున్న భవ్య రామమందిర ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులో భాగంగా చేపట్టాల్సిన క్రతువులు ఇవాళ ప్రారంభించారు. రామమందిరంలోని 11 మంది పూజారులు ఈ క్రతువుల్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. వారం రోజుల పాటు సాగే ఈ క్రతువులు జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్టతో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో ఈ వారం రోజుల పాటు అయోధ్య ఆధ్యాత్మికత రాజధానిగా మారిపోనుంది.

అయోధ్యలో జనవరి 22న జరిగే రామ్ లల్లా విగ్రహాల ప్రాణప్రతిష్ట సందర్భంగా సంప్రదాయ బద్దంగా కొన్ని క్రతువులు నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని అక్కడి ఆలయ పూజారులు నిర్వహించనున్నారు. వీటికి ఇవాళ బీజం పడింది.ఇవాళ ఆలయ ట్రస్ట్ సభ్యుడు, ఆయన భార్య నేతృత్వంలో వరుస ఆచారాలతో ఈ క్రతువులు ప్రారంభమయ్యాయి. ఈ క్రతువుల్లో ముందుగా "'అనుష్ఠాన్' కార్యక్రమం ప్రారంభమైంది. ఇది జనవరి 22న జరిగే పవిత్రోత్సవం వరకు కొనసాగుతుంది.

 Ram Mandir Consecration: 11 priests begins Rituals in Ayodhya...

పదకొండు మంది పూజారులు దేవతలను ప్రార్థిస్తూ ఈ క్రతువులు నిర్వహిస్తున్నారని రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ చెప్పారు. ఈ ఆచారాలలో చేపట్టే 'యజ్ఞం' ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ఆయన భార్య ఉషా మిశ్రా సమక్షంలో మొదలుపెట్టారు. మరోవైపు ఆగ్రాలోని ప్రసిద్ధ 'పేటా'లోని యాభై ఆరు రకాలు, అనేక రకాల రుచులను రాముడికి నైవేద్యంగా పెట్టేందుకు పంపారు. 560 కిలోలకు పైగా 'పేట'తో పాటు, ఆలయ ట్రస్ట్‌కు వివిధ ప్రాంతాల నుండి రత్నాలు పొదిగిన దుస్తులు, వెండి పలక, ఇతర పూజా సామాగ్రి కూడా వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+