రాను ఇది సరికాదు, ఇంతలో ఎంత మార్పు, సెల్ఫీ అడిగితే ఇలానా.. ఇంటర్నెట్ స్టార్పై విమర్శలు (వీడియో)
కుటుంబం కాదంది. ఉన్న కూతురు కూడా చెరదీయలేదు. దీంతో రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాం వద్ద యాచిస్తోంది. అయితే ఆమె అపురూప గాత్రం అక్కడున్న వారిని ఆకట్టుకొంది. అలా సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. జీవితమే మారిపోయింది. ఆమె ఎవరో ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది. అవును రాను మొండల్.. కానీ ఆమె ఓ అభిమానితో మాత్రం హద్దుమీరి ప్రవర్తించింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వెరల్గా మారింది.
తానో సెలబ్రిటీ..
ఇటీవల ముంబైలోని ఓ స్టోర్కు రాను మొండల్ తన కూతురితో కలిసి వెళ్లారు. ఆమె ఇప్పటికే ఫేం అయినందున ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఇంతలో ఓ యువతి రాను వద్దకొచ్చారు. సాధారణంగా సెలబ్రిటీలతో ఫోటోలు దిగేందుకు ఇష్టపడుతుంటారు. అలాగే రాను వద్ద చనువు తీసుకొని ఆ యువతి చేయి లాగారు. అంతే రానుకు కోపమొచ్చింది. తానేంటీ ? తన స్థాయి ఏంటీ అని ప్రశ్నించింది.
ఫోటో అడిగితే..
ఫోటో అడిగిన పాపానికి ఆ యువతికి చుక్కలు చూపించింది. ఏంటీ ? ఏం కావాలి ? అడగాలి కదా .. చేయితో ఇలా ఇలా అనడం ఏంటీ అని ప్రశ్నించారు. రాను ప్రవర్తనతో యువతి విస్తుపోయారు. ఏం అనాలో, చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. చేయి పట్టుకొని ఇలా అనడం ఏంటీ, దీని అర్థం ఏంటీ అని రాను అనడంతో.. ఆ యువతి ఒక్క మాట కూడా అనలేకపోయారు. కానీ ఇదంతా వీడియో రికార్డైంది. దానిని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకెమంది రానును నెటిజన్లు కడిగిపారేశారు.
ఏంటీ రాను ఇదీ...
రాను ఏంటీ ఇది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఫోటో అడిగితే ఇలా ప్రవర్తిస్తావా అంటూ మండిపడ్డారు. మీరు ఈ స్థాయిలో ఉండటానికి తాము కారణం కాదా అని ప్రశ్నించారు. తామ షేర్ చేయడం వల్లే బాలీవుడ్లో అవకాశం వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అలాంటిది ఫ్యాన్స్పై విరుచుకుపడితే ఎలా అని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని, తీరు మార్చుకోవాలని సూచించారు.
యాచన మరిచిన రాను
కోల్కతా రైల్వేస్టేషన్లో యాచిస్తూ ‘ఏఖ్ ప్యార్ కా నగ్మా హై' అంటూ పాడిన పాటను 26 ఏళ్ల ఇంజనీర్ అతింద్ర చక్రబర్తి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కానీ ఆ పోస్ట్ తెగ వైరలైపోయింది. ఆ వెంటనే హిమేష్ రెష్మానియాతో రానును ఫోన్ వచ్చింది. ముంబైలో రెష్మానియా ముందు కూడా పాటలు పాడటంతో అతను ఇంప్రెస్ అయ్యి.. తన సినిమాలో పాటలు పాడే అవకాశం ఇచ్చారు. దీంతో రాను ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయారు.