అరచేతిపై వైద్యురాలి సూసైడ్ నోట్.. 'ఆ పోలీస్ నాపై 4 సార్లు' ..!
మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకూ అధికం అవుతూనే ఉన్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మృగాళ్లా వ్యవహరిస్తున్నారు కొందరు. ఇటీవల ఏపీలో 13 ఏళ్ల చిన్నారిపై తాత వయసున్న ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన చూశాం. తాజాగా చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీస్ హద్దు మీరాడు. ఓ మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వైద్యురాలిపై ఏకంగా నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఆ మహిళా డాక్టర్ తన అరచేతిపై సూసైడ్ నోట్ రాసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
మహారాష్ట్రలోని సతరా జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. మహిళల్ని, చిన్నారుల్ని కాపాడాల్సిన పోలీసులే వారిపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఓ మహిళా వైద్యురాలిని స్థానిక ఎస్సై గోపాల్ బడ్నే వేధించసాగాడు. ఆమెపై గత ఐదు నెలలుగా నాలుగుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ ఎస్సైతో పాటు తోటి పోలీసుల నుంచి కూడా ఆమెకు వేధింపులు వచ్చాయి. దీంతో మనస్తాపానికి లోనైన ఆ వైద్యురాలి తన అరచేతిపైనే సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు ఎస్సై గోపాల్ బడ్నేను సస్పెండ్ చేసి ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.
" పోలీస్ అధికారి గోపాల్ బడ్నే నా చావుకి కారణం. అతడు నాపై 4 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఐదు నెలలుగా నన్ను మానసికంగా.. శారీరకంగా వేధించాడు" అని వైద్యురాలు తన అరచేతిపై సూసైడ్ నోట్ రాసుకుంది. ఫాల్తాన్ సబ్- డిస్ట్రిక్ట్ లోని ఆస్పిటల్ లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఆ వైద్యురాలు.. ఈ ఏడాది జూన్ లోనే పోలీస్ అధికారులపై డీఎస్పీ కార్యాలయానికి లేఖ పంపింది. ఫాల్తాన్ రూరల్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులు తనను వేధిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. ఆ లేఖలో గోపాల్ బడ్నే, పాటిల్, లాడ్ పుత్రే పేర్లను పేర్కొంది.

అయితే తాజాగా సీఎం ఫడ్నవీస్ ఆదేశాలతో గోపాల్ బడ్నేను సస్పెండ్ చేసినట్లు సతారా పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వైద్యురాలి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన రాజకీయంగానూ వివాదంగా మారింది. ఇదే ఘటనపై రాజకీయపార్టీలు ఒకర్నొకరు దూషించుకుంటున్నాయి. మరోవైపు ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించనున్నట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ రూపాలి చంద్రశేఖర్ తెలిపారు. నిందితుల్ని పట్టుకునేందుకు ఇప్పటికే స్పషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications