మహా సీఎం ఎవరైనా మా మద్దతు ఉంటుంది: శివసేన
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేసినా తమ మద్దతు ఉంటుందని శివసేన పార్టీ తన పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. మహారాష్ట్రను ముందుకు నడిపించే నేతకు తమ మద్దతు తప్పక ఉంటుందని తెలిపింది.
మహారాష్ట్రలో బీజేపీతో పొత్తు అధికారంగా ఖరారు కాకపోయినా.. ఆదివారం జరిగిన సమావేశంలో కొంత మంది బీజేపీ నాయకులు శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఇది ఇలా ఉంటే మంగళవారం బీజేపీ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్, మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు జెపి నడ్డా హాజరుకానున్నారు.

మరోవైపు, అక్టోబర్ 30న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
మోడీ, అమిత్ షాలను పొగుడుతూ సామ్నా సంపాదకీయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు భారతీయ జనాతా పార్టీని చీల్చిచెండాడిన శివసేన తాజాగా పొగడ్తలు మొదలుపెట్టింది. పార్టీ పత్రిక 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను పొగడ్తలతో ముంచెత్తింది.
ఇందుకు కారణం ఆ పార్టీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా అవతరించడమే. అంతేకాదు, బీజేపీ నేతృత్వంలో రాష్ట్ర పాలన సాగడం చాలా సంతోషమని తెలిపింది. మహారాష్ట్రలో ఈ విజయానికి కారణమైన ప్రధాని మోడీ, అమిత్ షాలను కూడా ప్రశంసించింది.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications