స్పికర్ నిర్ణయం పై సుప్రిం కోర్టుకు వెళతాం రెబల్ ఎమ్మెల్యేలు
తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినున్నట్లు జేడీ(ఎస్) రెబల్ ఎమ్మెల్యే విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్కుమార్ 14మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ మాట్లాడుతూ.. అనర్హత వేటు వేయడం చట్టవిరుద్దం అంటూ పెర్కోన్నారు. కాగా స్పీకర్ చర్యపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు ఆయన తెలిపారు. విశ్వనాథ్ తోపాటు ప్రతాప్ గౌడ అనే ఎమ్మెల్యే సైతం కోర్టుకు వెళ్లనున్నన్నట్టు ఓ వీడీయో విడుదల చేశారు.

స్పీకర్ రమేశ్కుమార్ అనర్హత వేటు వేసిన వారిలో 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు జేడీ(ఎస్)కు చెందిన వారు ఉన్నారు కాగా ఒకేసారి 14 మందిపై వేటు వేయడంతో అనర్హత వేటు పడిన వారి సంఖ్య మొత్తం 17కు చేరింది. దీంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఈ సంఖ్య 207కి పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 105 కాగా.. బీజేపీకి సొంతంగా 105 మంది సభ్యులు.. స్వతంత్రులు ఇద్దరు కలిపి ఆ పార్టీ బలం 107కి చేరింది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ బలం 99కి పడిపోయింది.












Click it and Unblock the Notifications