భారత్ లో గణనీయంగా తగ్గిన కొత్త కేసులు, మరణాలు .. గత 24 గంటల్లో 34,703 కేసులు, 553 మరణాలు
భారతదేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో 34,703 కొత్త కేసులు నమోదయ్యాయి . దీంతో భారత దేశంలో మొత్తం కరోనా కేసులు 3,06,19,932 కి చేరుకున్నాయి. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఇప్పటివరకు, ఈ రోజు మాత్రమే అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 18వ తేదీన 35,781 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అప్పటినుండి ఇప్పటివరకు ఇంత తక్కువ నమోదు కావడం ఇదే తొలిసారి.
కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు .. కేంద్రం పదేపదే చెప్పటానికి కారణాలు ఇవే !!
కరోనా మహమ్మారి కారణంగా 553 మంది మృత్యువాత పడగా, మొత్తం మరణాల సంఖ్య 4,03,281కు చేరుకుంది. గత 24 గంటల్లో 51,864 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలను చూస్తే 2,97,52,294 కు చేరుకున్నట్టు తెలుస్తోంది. కొత్త కేసుల కంటే రోజువారీ రికవరీలు ఎక్కువగా నమోదు కావడం వరుసగా ఇది 54 వ రోజు .దేశంలో కరోనా యాక్టివ్ కేసులు కూడా 4, 64,357 కు తగ్గాయి. ఇవి మొత్తం కేసుల్లో 1.58 శాతం ఉన్నాయి. నిన్నటికి నిన్న 39,796 మంది కరోనా పాజిటివ్ కొత్త కేసులను గుర్తించగా నేడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గడంతో 5,093 తక్కువ కేసులు నమోదయ్యాయి.
మరోవైపు, 723 మరణాలు సోమవారం నాడు నమోదుకాగా ఈ రోజు కేవలం 553 మంది మాత్రమే మృతిచెందారు. ఇది నిన్నటి తో పోలిస్తే 170 మంది తక్కువ.ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, కోవిడ్ -19 కోసం ఇప్పటివరకు 42,14,24,881 నమూనాలను పరీక్షించారు. వీటిలో గత 24 గంటల్లో 16,47,424 పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ మరియు మే మొదట్లో దారుణ పరిస్థితుల్లో ఉన్న మహమ్మారి యొక్క రెండవ తరంగంతో భారతదేశం పోరాడుతుండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నివేదిక ప్రకారం మూడవ వేవ్ ఆగస్టు నాటికి దేశాన్ని తాకుతుందని, అది సెప్టెంబర్ లో పీక్స్ కు చేరుతుందని వెల్లడించింది.
Recommended Video
"కోవిడ్ -19: రేసు టు ఫినిషింగ్ లైన్" నివేదిక దాని అంచనాలను చారిత్రక పోకడల ఆధారంగా నిర్ధారించింది.మే 7 నుండి రోజువారీ కేసులు పెరగలేదు మరియు అనేక రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు (యుటిలు) లాక్డౌన్ లాంటి ఆంక్షలను సడలిస్తున్నాయి. కోవిడ్ తగిన ప్రవర్తనను అనుసరించడం ద్వారా వాణిజ్య మరియు ఆర్ధిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించటానికి వీలు కల్పిస్తుంది. కానీ ప్రజలు ఇప్పటికీ కోవిడ్-సంబంధిత ప్రోటోకాల్స్ అయిన సామాజిక దూరం పాటించడం,మాస్కులు ధరించడం వంటి వాటిని ఉల్లంఘిస్తున్నారని సమాచారం. ఇది రోజువారీ కేసులు మళ్లీ పెరిగే ప్రమాదాన్ని పెంచుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.