ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరపండి: కేంద్రానికి లేఖ
ముంబై: తమ సంస్థకు చెందిన వారితో సహా ప్రముఖులు ఫోన్లను ఓ కార్పోరేట్ సంస్థ ట్యాప్ చేసిందని సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్న వార్తల పైన రిలయెన్స్ గ్రూప్ శనివారం నాడు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరింది.
ఫోన్ ట్యాపింగ్ విషయమై వీలైనంత త్వరగా సమగ్ర విచారణ జరిపించి, దోషులనుపట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయడం నేరమని, అక్రమమని, తమ స్వప్రయోజనాల కోసమే కొందరు ఈ పనికి పాల్పడ్డారని, తమ సంస్థ పునర్ వ్యవస్థీకరణ జరగకముందే ఈ ట్యాపింగ్ జరగడం గమనార్హమని సంస్థ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

ట్యాపింగ్ సంభాషణల్లో తమ పైన వెలుగు చూసిన ఆరోపణలు అవాస్తవమని రిలయన్స్ గ్రూప్ తెలిపింది. కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు సహా పలువురు ప్రముఖుల ఫోన్లను 2001-2006 మధ్య కాలంలో ట్యాప్ చేశారని వచ్చిన వార్తలు శుక్రవారం సంచలనం రేపాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications