రాజీనామా సిఎం ఇష్టం, టీపై వెనక్కి వెళ్లం: సందీప్ దీక్షిత్

ఆంటోనీ కమిటీ ఐదారు విషయాలపై అభిప్రాయ సేకరణ జరుపుతోందని, వాటిని బిల్లులో పొందుపరుస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల రాజీనామాలను స్పీకర్ ఇంకా ఆమోదించలేదని ఆయన చెప్పారు. తెలంగాణపై సిడబ్ల్యుసి తీర్మానాన్ని చించేయాలనేది సీమాంధ్ర నేతల వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి సిడబ్ల్యుసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తారని వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. రాజీనామా అనేది ముఖ్యమంత్రి ఇష్టమని, ముఖ్యమంత్రి రాజీనామా కిరణ్ కుమార్ రెడ్డికీ పార్టీ అధిష్టానానికీ మధ్య వ్యవహారమని ఆయన అన్నారు. రాష్ట్రమంత్రి విశ్వరూప్ రాజీనామాపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. అది రాష్ట్రానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఢిల్లీకి ఆహ్వానించారు. ఆయన రేపు మంగళవారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. బొత్స సత్యనారాయణ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపించాలని అడిగే అవకాశం ఉంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications