తేజస్వీ యాదవ్ కు ఆర్జేడీలో టాప్ పోస్ట్..! వ్యతిరేకించిన సోదరి రోహిణి..!
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆ పార్టీ అగ్రనేత తేజస్వీ యాదవ్ (tejashwi Yadav)ను నియమిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.తాజాగా జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం ప్రకటించారు. గతేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడపటంలో విఫలమైన నేపథ్యంలో తేజస్వీ యాదవ్ కు లాలూ ఈ కీలక పదవి కట్టబెట్టడం విశేషం.
పార్టీ అగ్ర నాయకులు హాజరైన ఆర్జేడీ జాతీయ కార్యవర్గ భేటీ ప్రారంభ సమావేశంలో తేజస్వీ యాదవ్ కు ప్రమోషన్ ప్రకటన చేశారు. ప్రస్తుతం పార్టీ అధినేతగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, సమీప భవిష్యత్తులో మాజీ డిప్యూటీ సీఎంను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసే ప్రణాళికలతో ముందుకు సాగాలని పార్టీ గత వారం నిర్ణయించింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత పార్టీ భవిష్యత్ వ్యూహాల ఖరారుకు ఈ నెల 16, 17 తేదీల్లో ఆర్జేడీ తన మొదటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది.

ఈ సమావేశంలో 2020లో 80 సీట్ల నుండి గత ఏడాది 35 సీట్లకు అసెంబ్లీ సీట్లు తగ్గిన తర్వాత వ్యూహాల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆర్జేడీ నేతలు నిర్ణయించారు. అలాగే ఆర్జేడీకి చెందిన నలుగురు లోక్సభ ఎంపీలు, ఐదుగురు రాజ్యసభ ఎంపీలతో రాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశానికి వ్యూహాన్ని రూపొందించడానికి తేజస్వీ యాదవ్ వారితో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ జనతాదళ్ ఇవాళ బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ను పార్టీ కొత్త జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించింది. బీహార్ మాజీ సీఎంలు అయిన లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి సమక్షంలో తేజస్విని పార్టీ జాతీయ వర్కింగ్ చీఫ్గా నియమించారు.

మరోవైపు తేజస్వి యాదవ్ నియామకాన్ని ఆయన సోదరి రోహిణీ ఆచార్య వ్యతిరేకించారు. పార్టీ లాలూ వాదం నుంచి దూరంగా వెళ్లోందని వ్యాఖ్యానించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రోహిణీ ఆచార్య తనను కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారంటూ తేజస్వీపై తీవ్ర ఆరోపణలు చేసారు. అయితే లాలూ ప్రసాద్ ఇంట్లో పరిస్ధితిని చక్కదిద్దేందుకు స్వయంగా రంగంలోకి దిగి పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ సహా అందరినీ బుజ్జగించారు. అయితే రోహిణి మాత్రం వెనక్కి తగ్గలేదు.












Click it and Unblock the Notifications