జలియన్ వాలా బాగ్ దురాగతం : 100 నాణెం, స్టాంపు విడుదల
అమృత్సర్ : జలియన్ వాలా బాగ్ మారణ హోం జరిగి వందేళ్లు గడిచింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకున్న బ్రిటీష్ దుశ్చర్యకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూ. వంద నాణేం విడుదల చేసింది. శనివారం పంజాబ్ లోని అమృసర్ లోని జలియాన్ వాలా బాగ్ స్మారకం వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం స్మృతి చిహ్నాంగా వంద రూపాయల నాణెం, స్టాంపును విడుదల చేశారు.

బ్రిటీష్ దురాగతం
స్వాతంత్ర పోరాటంలో జలియన్ వాలా బాగ్ ఉదంతం హేయనీయమైన ఘటనగా గుర్తుండిపోయింది. పంజాబీలకు ముఖ్యమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాదిమందిని 1919 ఏప్రిల్ 13న జనరల్ డయ్యర్ ఆదేశాలతో కాల్పులు జరిపారు. దీంతో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి వందేళ్లైన తర్వాత బ్రిటీష్ ప్రధాని థెరెసా మే .. సిగ్గుచేటని వ్యాఖ్యానించడంతో సర్వత్రా విమర్శులు వ్యక్తమైన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications