ఆ స్కూల్లో అదిరిపోయే అడ్మిషన్ ఫీజు.. అయినాసరే, సినీ ప్రముఖుల పిల్లలు క్యూ కడతారు!
ముంబై: ఆ స్కూల్లో అడ్మిషన్ ఫీజు ఎంతో తెలిస్తేనే కళ్లు తేలేస్తారు! అక్షరాలా రూ.24 లక్షలు. అయినా సరే ఆ స్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ప్రముఖులు 'క్యూ' కడుతుంటారు.
అది ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్. ముంబైలోని బాంద్రా ఈస్ట్ బీకేసీ కాంప్లెక్స్లో 2003లో ఈ స్కూల్ ఏర్పాటయింది. దీనిని ధీరూభాయ్ అంబానీ పెద్ద కోడలు నీతా అంబానీ నిర్వహిస్తున్నారు. ఈవిడ.. ముకేశ్ అంబానీ సతీమణి.
ఈ స్కూల్లో స్కాలర్షిప్ అందుకున్న విద్యార్థులు స్టాన్ఫోర్డ్, ప్రిన్స్టెన్ తదితర ఇంటర్నేషనల్ యూనివర్శిటీలలో చదువుకునేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్కూల్లో 15 వేల మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు.
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ముంబైలోనే నంబర్ వన్ స్కూల్. ఐశ్వర్యరాయ్ బచ్చన్, షారూఖ్ఖాన్, అర్బజ్ ఖాన్, హృతిక్ రోషన్, కరిష్మా కపూర్ తదితర సినీనటుల పిల్లలు ఈ స్కూల్లోనే చదువుకుంటున్నారు.
హైసెక్యూరిటీతో పాటు సకల సదుపాయాలు కలిగిన ఈ స్కూల్లో ప్రతి ఏటా వార్షికోత్సవ కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ స్కూల్కు భారత్లో నంబర్ వన్ నేషనల్, ఇంటర్నేషనల్ స్కూలు ర్యాంకు లభించింది.