ఇండియాను ఇక ముందు భారత్ అని పిలుద్దాము, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్, ఇండియా కూటమికి !
న్యూఢిల్లీ/ గుహవాటి: ఇండియాను భారత్ అని అందరు పిలవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ దేశంలోని ప్రజలను అభ్యర్థించారు. భారతదేశం అనే పేరుకు చారిత్రక ప్రాధాన్యత ఉందని, ఇది పురాతన కాలం నుంచి వాడుకలో ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు.
గౌహతిలో సకల్ జైన సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ ప్రకటన చేశారు. మన దేశం పేరు పూర్వం నుంచి భారత్. భాషలు ఎలా ఉన్నా పేరు మాత్రం అలాగే ఉంటుంది అని మోహన్ భగవత్ అన్నారు. లెక్కలేనన్ని తరాలుగా భారతదేశం అనేది మన దేశానికి పేరు. భాషా భేదం లేకుండా ప్రజలు భారతదేశం అని పిలవడం ప్రారంభించాలి అని మోహన్ భగవత్ అన్నారు.

ఇంతలో మోహన్ భగవత్ ఐక్యత మరియు అందరినీ కలుపుకొని పోయే శక్తిని నొక్కి చెప్పారు. ప్రపంచ వేదికపై భారతదేశం ఏకం చేసే శక్తిగా వ్యవహరిస్తోందని మోహన్ భగవత్ నొక్కి చెప్పారు. భారతదేశ విద్యా వ్యవస్థపై బ్రిటిష్ వలస ప్రభావం ఉందని, దానిని తెరమరుగు చెయ్యాలని, నూతన విద్యావిధానం ద్వారా పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. భారతీయ సంస్కృతి విలువలు, సంప్రదాయాలు, కుటుంబ సూత్రాలను పిల్లలకు తెలియజేయాలని తల్లిదండ్రులను మోహన్ భగవత్ కోరారు.
భారతదేశంలోని ఎన్ డీఏ ప్రతిపక్ష కూటమికి ఇండియా' అని పేరు పెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఈ కూటమి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. ఇండియా కూటమి ఇప్పటికే మూడో సమావేశాన్ని ముంబాయిలో నిర్వహించింది. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్ డీఏని ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications