5 సంవత్సరాలకు ఒక్కసారి మారే ప్రభుత్వాలపై ఆర్ఎస్ఎస్ ఆధారపడదు , మోహన్ భగవత్
5 సంవత్సరాలకోసారి మారే ప్రభుత్వాలపై ఆర్ఎస్ఎస్ ఆధారపడదని ,ఈ నేపథ్యంలోనే వాటిపై నమ్మకం పెట్టుకోకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గతంలో, అంటే రాజరిక వ్యవస్థంలో వారిపై నమ్మకం ఉండడం వల్ల 30 నుండి 50 సంవత్సరాల వరకు కొనసాగేవని, కాని ఇప్పుటి ప్రభుత్వాల పై విశ్వాశాలు లేక 5 సంవత్సరాలకే మారేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల వాటిపై విశ్వాసం ఉండాల్సిన అవసరం లేదని సూచించారు..
ఈ నేపథ్యంలోనే సామాజిక సేవ సంస్థలతోపాటు వివిధ రంగాల్లో రీసెర్చ్ చేసే సంస్థలు ప్రభుత్వాల మీద ఆధారపడకూడదని ఆయన సూచించారు. మహమహోపాధ్యాయ 125 వ జయంతి ఉత్సవాల సంధర్భంగా ఆయన మాట్లాడారు. కాగా ప్రభుత్వాలతొ సంబంధాలు నెరవేర్చాలనుకునే వారు, వాటితో మంతనాలు జరపాలని కోరుకునే వారు , మొత్తంగా వాటిపై ఆధారపడాలని నేను అనుకోవడం లేదని అన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు మారేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

బ్రిటీష్ ప్రభుత్వాల పరిశోధన అంశాలపైనే భారత్
కాగా బ్రిటీష్ వారు ఆధునిక భారత్ కోసం అనేక అంశాలపై పరిశోధనలు జరిపారని ,వాటి ఆధారంగానే దేశం యొక్క జనాభ గణన, మరియు బౌగోలిక అంశాలు ఇప్పటికి వారి పరిశోధన ఆధారపడి కొనసాగుతున్నాయని అన్నారు.అయితే వాటిని ప్రజల సంక్షేమం కోసం గాని ,ప్రయోజనాల కోసం గాని చేశారని భావించలేమని అన్నారు.












Click it and Unblock the Notifications