మోడీని ప్రశ్నిస్తారా, మీరు సిద్ధమా?: అమెరికాపై ఆరెస్సెస్ నిప్పులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఫోర్డ్, గ్రీన్ పీస్ల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరిని అమెరికా ప్రశ్నించడంపై రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) తీవ్రంగా స్పందించింది. భారత సార్వభౌమత్వాన్ని గౌరవించాలని అమెరికాకు సూచించింది.
ఆరెస్సెస్ తన పత్రిక ఆర్గనైజర్లో అమెరికా పైన మండిపడింది. తమ దేశంలో లాభాపేక్ష లేని, రాజకీయేతర సంస్థల పేరిట చట్టాల ఉల్లంఘనను అమెరికా అనుమతిస్తుందా అని నిలదీసింది. ఫోర్డ్, గ్రీన్ పీస్లను వెనుకేసుకు రావడంలో అమెరికా తొందరపడుతోందని విమర్శించింది.
డీడీలో వారానికి అరగంట సంస్కృతం
సంస్కృతానికి సరైన గౌరవం ఇవ్వటంతోపాటు చాలాకాలంగా వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని వారాంతాల్లో అరగంట నిడివితో సంస్కృతం వార్తలు, కార్యక్రమాలు ప్రసారం చేయనున్నట్లు దూరదర్శన్ స్పష్టం చేసింది. జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటివారం నుంచి ఈ కార్యక్రమాలు ప్రసారం చేయాలని నిర్ణయించింది.