Sabarimala:కేరళలో రెడ్ అలర్ట్, బురేవి తుపాన్, అయ్యప్ప భక్తులు జాగ్రత్త, స్వామి తోడు, స్వామియేశరణమయ్యప్ప!
శబరిమల/ కొచ్చి/ పతనంపట్టి: శబరిమలకు వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులకు ఇప్పుడు బురేవి తుపాను రూపంలో మరో సమస్య ఎదరైయ్యింది. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారిని లెక్క చెయ్యకుండా శబరిమలకు స్వామియే శరణమయ్యప్ప అంటూ వెలుతున్న అయ్యప్ప భక్తులు రెండు రోజులు భారీ వర్షాలు పడతున్న సందర్బంగా మరోసారి కష్టాలను లెక్క చెయ్యకుండా ముందుకు వెలుతున్నారు. కేరళలో ఈనెల 2, 3వ తేదీల్లో భారీ వర్షాలు పడుతున్న సందర్బంగా ఇప్పటికే అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

అయ్యప్ప భక్తులకు ఆన్ లైన్ సమస్యలు
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు కేరళ ప్రభుత్వం అయ్యపస్వామి భక్తులకు ఇప్పటికే అనేక నియమాలు విధించింది. అతి కష్టం మీద కేరళ ప్రభుత్వం విధించిన రూల్స్ పాటిస్తూ ఆన్ లైన్ లో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అనుమతి తీసుకుంటున్న అయ్యప్ప భక్తులు శబరిమలకు వెలుతున్నారు. శబరిమలలో అయ్యపస్వామిని దర్శించుకుంటున్న అయ్యప్పస్వామి భక్తులు తరువాత మొక్కులు చెల్లించుకుని వెనుతిరుగుతున్నారు.

నివర్ కాదు మరో బురేవి తుపాను దెబ్బ
నివర్ తుపాను కారణంగా ఇప్పటికే అయ్యప్పస్వామి భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈనెల 2వ తేదీ, 3వ తేదీల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నివర్ తుపాను వెళ్లిపోయింది అనుకుంటున్న సమయంలో మరోసారి బురేవి తుపాను రూపంలో భారీ వర్షాలు పడుతాయని తెలియడంతో అయ్యప్పస్వామి భక్తులు కొంత ఆందోళనకు గురౌతున్నారు.

కేరళలో రెడ్ అలర్ట్
కేరళలోని తిరువనంతపురం, కోల్లాం, పతనంతిట్ట, అళప్పళ జిల్లాల్లో ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాలో 3 సె.మీ. నుంచి 20 సె.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో 6 సె.మీ. నుంచి 11 సె.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండటంతో ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్, ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు.
Recommended Video

అయ్యప్ప భక్తులు జాగ్రత్త
రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడటంతో శబరిమలకు వచ్చి వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని శబరిమల దేవస్వం బోర్డు, కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు మనవి చేసింది. ఏది ఏమైనా సరే ముందుగా ఆన్ లైన్ లో డేట్ ఫిక్స్ చేసుకున్న అయ్యప్ప భక్తులు అనుకున్న సమయానికి అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని నిర్ణయించారు. అయ్యప్పస్వామి తోడుగా ఉంటే మాకు ఏమీ కాదని, శబరిమలకు వెళ్లి వస్తామని అయ్యప్ప భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!!












Click it and Unblock the Notifications