Sabarimala: అయ్యప్ప సన్నిధానం ఖాళీ, 18వ దశాబ్దంలో ఒకసారి, ఆ మార్గంలో ఒక్క భక్తుడు రాలేదు, చాన్స్!
శబరిమల/ పతనంపట్టి/ కొచ్చి: శబరిమలలో అయ్యప్పస్వామి భక్తులతో ప్రతిరోజూ కిటకిటలాడే సన్నిధానంలో భక్తులు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. ఇంతకాలం అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి పోటీ పడిన అయ్యప్ప భక్తులు ఇప్పుడు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని సన్నిధానంలో ప్రార్థనలు చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా అనేక నియమాలు అమలులోకి తీసుకురావడంతో అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే ప్రతిఏడాది కొన్ని వేల మంది కాలినడకన వెళ్లే అయ్యప్పన్ రోడ్డులో ఇంత వరకు ఒక్క అయ్యప్పస్వామి భక్తుడు కూడా ఆ మార్గంలో వెళ్లలేదని అధికారులు అంటున్నారు.

COVID-19 నియమాలు
శబరిమలకు అయ్యప్పస్వామి భక్తుల తీర్థయాత్ర మొదలైన తరువాత ఎరిమేళి, పంబా, శబరిమల, పతనంపట్టి తదితర ప్రాంతాలు అయ్యప్పస్వామి భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతిఏడాది కొన్ని లక్షల మంది అయ్యప్పస్వామి భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకుని వారి కోరికలు తీర్చమని దేవుడిని వేడుకుంటారు. కొవిడ్ -19 నియమాల కారణంగా ఇప్పుడు కేవలం కొన్ని వేల మంది మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి భక్తులు వెలుతున్నారు.

18వ దశాబ్దంలో ఒకసారి
ప్రస్తుతం శబరిమల సన్నిధానం ఎన్నడూ లేని విధంగా ఖాళీగా దర్శనం ఇస్తోంది. 18వ దశాబ్దంలో ఒకసారి శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో చాలా తక్కువ మంది భక్తులు ఉన్నటువంటి ఇలాంటి దృశ్యాలు చూశామని, ఇప్పుడు మరోసారి అలాంటి దృశ్యాలు చూస్తున్నామని పతనంపట్టిలోని స్థానికులు, అయ్యప్పస్వామి ఆలయలంలోని అర్చకులు అంటున్నారు.

ఆ మార్గంలో ఒక్క భక్తుడు రాలేదు
అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిఏడాది కొన్ని లక్షల మంది అయ్యప్ప భక్తులు దీక్ష చేపట్టి అటవి మార్గంలో నడుచుకుంటూ శబరిమల చేరుకుని స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంటుంటారు. అలాంటిది కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఈ ఏడాది సోమవారం వరకు అటవి మార్గంలో నడుచుకుంటూ అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఒక్క భక్తుడు కూడా రాలేదని అయ్యప్పస్వామి ఆలయ కమిటి నిర్వహకులు అంటున్నారు.

శరణ ఘోషలు లేవు
అయ్యప్పస్వామి భక్తులు ధీక్ష చేపట్టి కఠిననియమాలు పాటించి అటవి మార్గంలో తలమీద ఇరుముడి పెట్టుకుని కాలినడకన స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణఘోషతో శబరిమల చేరుకుంటారు. అయితే ఈ ఏడాది కాలినడకన ఇంత వరకు అయ్యప్పస్వామి భక్తులు ఒక్కరుకూడా అలా వెళ్లకపోవడంతో ఆ ప్రాంతంలో శరణఘోషలు వినపడటం లేదని, ఇలాంటి సన్నివేశాలు తాము ఇంత వరకు చూడలేదని స్థానిక అధికారులు అంటున్నారు.
Recommended Video

సన్నిధానంలో ఇదే పరిస్థితి
శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలో ఇంతకు ముందు ఎక్కువ సమయం అయ్యప్పస్వామి భక్తులు ఉండటానికి అవకాశం లేదు. ఇప్పుడు భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో అయ్యప్పస్వామి భక్తులు ఎక్కువ సమయం సన్నిధానంలో గడుపుతున్నారు. మా కోరికలు తీర్చు స్వామి అంటూ అయ్యప్పస్వామి భక్తులు స్వామివారిని వేడుకుంటూ ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుని వెనుతిరుగుతున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications