Sabarimala: శబరిమలలో మకరవిలక్కుంకు ఏర్పాట్లు, స్వామియేశరణం అయ్యప్ప, ఆరోజు రాజకుటుంబం!
శబరిమల/ పందలం/ కొచ్చి: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్పస్వామి మండల పూజలు పూర్తి అయ్యాయి. అయ్యప్పస్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించి, పూజించే మండల దీక్షను వేలదిమంది భక్తులు పూర్తి చేసుకున్నారు. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో సాంప్రధాయం ప్రకారం మండల పూజలు పూర్తి అయ్యాయి. శబరిమలలో ఇక మకరవిలక్కు ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి శబరిమల దేవస్వం బోర్డు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. చివరి రోజు రాజకుటుంబం పూజలు చేసిన తరువాత అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు, దర్శనాలకు తెరపడుతుంది.
Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!
ప్రధాన అర్చకుడు
శబరిమల ప్రధాన (చీఫ్) అర్చకుడు కండరారు రాజవర్ నేతృత్వంలో అయ్యప్పస్వామి సన్నిధానంలొ ఒక రోజు పూర్తిగా 41 రోజుల అయ్యప్పస్వామి మండల పూజలు ఘనంగా నిర్వహించారు. అయ్యప్పస్వామి మండల పూజలు అర్చకులు, భక్తులు ఎంతో పవిత్రంగా భక్తిశ్రద్దలతో నిర్వహించారు.
అయ్యప్పస్వామి నగలు
మండల పూజకు ముందు అయ్యప్పస్వామికి ఎంతో ఇష్టం అయిన తంక-అంకి కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్పస్వామికి తరతరాలుగా అలకంరిస్తున్న బంగారు నగలతో స్వామిని చాలా అందంగా అలంకరించారు. అయ్యప్పస్వామి బంగారు నగలతో దర్శనం ఇవ్వడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు.
డిసెంబర్ 30 వరకు ఆలయం మూత
శబరిమలలో అయ్యప్పస్వామికి మండల పూజలు పూర్తి అయిన తరువాత ఆలయం మూసివేశారు. డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయ్యప్పస్వామి సన్నిధానం మూతపడటంతో స్వామిని దర్శించుకోవడానికి అయ్యప్పస్వామి భక్తులకు అవకాశం లేదు. డిసెంబర్ 31వ తేదీన మళ్లీ అయ్యపస్వామిని దర్శించుకోవడానికి సామాన్య భక్తులకు అవకాశం ఇస్తారు.
మకరవిలక్కు ఉత్సవాలు
శబరిమలలో అయ్యప్పస్వామి మకరవిలక్కు ఉత్సవాలు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 11వ తేదీన ఏరిమేళిలో పట్టేతుళ్ళాల్ ఉత్సవాలు నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు. ఏరిమేళిలో పట్టేతళ్ళాల్ ఉత్సవాలు మొదలైన మరుసటి రోజు పందలంలో శబరిమల తిరువాభరణం ఊరేగింపు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జనవరి 14 మకరవిలక్కు
2021
జనవరి
14వ
తేదీన
మకరవిలక్కు
ఉత్సవం
రంగరంగ
వైభంగా
నిర్వహిస్తారు.
జనవరి
19వ
తేదీన
శబరిమలలోని
మలికాప్పురం
దేవి
దేవాలయంలో
మకరవిలక్కు
వార్షిక
ఉత్సవాలు
కన్నుల
పండుగగా
నిర్వహించడానికి
సర్వం
సిద్దం
చేస్తున్నారు.
జనవరి
20వ
తేదీన
ఉదయం
శబరిమల
రాజకుటుంబం
కుటుంబ
సభ్యులు
అయ్యప్పస్వామిని
ప్రత్యేకంగా
దర్శించుకోవడానికి
ఏర్పాట్లు
జరుగుతున్నాయి.
రాజకుటుంబ
సభ్యులు
అయ్యప్పస్వామిని
దర్శించుకున్న
తరువాత
శబరిమలలోని
ఆలయం
మూసివేస్తారు.