నోటీసులు నేను లెక్క చేయను, అయినా.... మూడోసారి సాధ్వీకి నోటీసులు జారీ చేసిన ఈసీ
ఎన్నికల సంఘం నోటిసులను లెక్క చేయని భాజపా అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ,తన పై ఉన్న ప్రచార నిషేధాన్ని ఉల్లంఘించి ప్రచారంలో పాల్గోన్నందుకు గాను సాధ్వీకి మరో నోటిస్ను జారీ చేసింది మధ్యప్రదేశ్ ఎన్నికల సంఘం.
సాధ్వీ ప్రగ్యా ఎన్నికల్లో పోటి చేస్తున్నప్పటి నుండి.. ఏప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. ఈనేపథ్యంలోనే మధ్యప్రదేశ్లోని భోపాల్ పార్లమెంట్ స్థానం నుండి పోటి చేస్తున్న సాధ్వీ ప్రగ్యా కు ఈసి తాజాగా మరో నోటిసును అందించింది. ఆమేకు ఇదివరకే రెండుసార్లు పలు విషయాల్లో ఈసీ నోటీసులు జారి చేసింది. అయితే కొద్ది రోజుల క్రితం ఓ టీవీ ఇంటర్వులో మాట్లాడుతూ..ఆయోధ్యలోని బాబ్రీ మసీదు ఘటనలో పాల్గోన్నందుకు నాకు చాల గర్వంగా ఉందని, తాను మసీదు పైకి ఎక్కానని తెలిపారు. అయితే ఈ ఇంటర్వూపై ఫిర్యాదు అందుకున్న ఈసీ, ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను మే 2నుండి 72 గంటలపాటు ప్రచారంలో పాల్గోనకుండా నిషేధం విధించారు.
వీటిని ఖాతరు చేయని సాధ్వీ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నట్టుగా మరోసారి ఈసీకి ఫిర్యాదు అందుకుంది. దీంతో ప్రచారంలో పాల్గోన్న అంశంపై వివరణ ఇవ్వాలని మరోనోటీసును జారి చేసింది. అయితే అంతకు ముందు ముంబాయి బాంబుపేలుళ్లలో మృతి చెందిన ఐపిఎస్ అధికారి హెమంత్ కర్కరే తన శాసం వల్లే ఆయనకు చనిపోయో గతి పట్టిందని వ్యాఖ్యలు చేయడంతో మొదటి సారి ఈసి నోటీసులు జారి చేసింది. కాగా తాజాగా ఎన్నికల సంఘం మూడోసారి సాద్వీ నోటీసులు జారీ చేశారు.