Sadist: భార్య వదిలేసింది, తల్లికి ప్రాణం ఉండగానే ఇంటి వెనుక పూడ్చేసిన కసాయి కొడుకు, చివరికి !
చెన్నై/ విల్లుపురం: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో కాపురం చేసి నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. రానురాను భర్త అతని భార్యకు టార్చర్ పెట్టాడు. భర్త చిత్రహింసలు తట్టుకోలేని భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వదిలేసి వెళ్లిపోవడంతో ఇంకా ఎక్కువ మద్యం సేవిస్తున్న అతను తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. రాత్రి తల్లిని ఇంటిలో నుంచి బయటకు లాగిన కొడుకు ఆమెను చితకబాదేశాడు. పోలీసు కేసు అవుతుందని భయంతో రాత్రికిరాత్రి ఇంటి వెనుక గొయ్యి తీసిన కొడుకు ప్రాణాలతో ఉన్న అతని తల్లిని పూడ్చిపెట్టి చేతులు దులుపుకున్నాడు.

నలుగురు పిల్లలు
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని ముక్తైయూర్ సమీపంలోని చిట్టూరు గ్రామంలో శక్తివేల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం శక్తి వేల్ సెల్వీ మహిళను వివాహం చేసుకున్నాడు. సంతోషంగా వివాహం చేసుకున్న శక్తివేల్ అతని భార్య
సెల్వీతో కాపురం చేసి నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు.

భర్త టార్చర్ తట్టుకోలేక పుట్టింటిలో భార్య
గుజరి వస్తువులు సేకరించి వాటిని విక్రయిస్తున్న శక్తివేల్ రోజుపీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్య సెల్వీని చితకబాదుతున్నాడు. కూలిపనులు చేస్తున్న శక్తివేల్ భార్య సెల్వీ, అతని తల్లి యశోధ నలుగురు పిల్లలను పోషించారు. రానురాను శక్తివేల్ అతని భార్య సెల్వీకి టార్చర్ పెట్టాడు. భర్త శక్తివేల్ చిత్రహింసలు తట్టుకోలేని భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.

కొడుకు దెబ్బతో ఎదురింటిలో నిద్రపోతున్న తల్లి
భార్య సెల్వీ వదిలేసి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఇంకా ఎక్కువ మద్యం సేవిస్తున్న శక్తివేల్ అతని తల్లి యశోధతో కలసి నివాసం ఉంటున్నాడు. మద్యంకు డబ్బులు ఇవ్వాలని శక్తివేల్ అతని తల్లి యశోధను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కొడుకు శక్తివేల్ హింస భరించలేని అతని తల్లి యశోధ ఎదురింటిలోని బంధవుల ఇంటిలో రాత్రిపూట నిద్రపోతున్నది.

తల్లి ప్రాణాలతో ఉంటే ఇంటి వెనుక పూడ్చేసిన కొడుకు
రాత్రి ఎదురింటిలో నిద్రపోతున్న తల్లి యశోధను ఇంటిలో నుంచి బయటకు లాగిన కొడుకు ఆమెను చితబాదేశాడు. రోడ్డు మీద ఈడ్చడంతో యశోధకు తీవ్రగాయాలైనాయి. పోలీసు కేసు అవుతుందని భయంతో రాత్రికిరాత్రి ఇంటి వెనుక గొయ్యి తీసిన శక్తివేల్ ప్రాణాలతో ఉన్న అతని తల్లి యశోధను పూడ్చిపెట్టి చేతులు దులుపుకున్నాడు.

చితకబాదిన బంధువులు
ఉదయం యశోధ కనపడకపోవడంతో ఆమె బంధువులు ఆమె ఇంటికి వెళ్లి చూశారు. ఇంటిలో నిద్రపోతున్న శక్తివేల్ బంధువులను చూసి లోపల డోర్ లాక్ చేశాడు. తలుపులు పగలగొట్టిన బంధువులు శక్తివేల్ ను చితకబాదడంతో అసలు మ్యాటర్ చెప్పాడు. పోలీసులు ఇంటి వెను గొయ్యి తీసి యశోధ శవం బయటకు తిసి విల్లుపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిని చంపేసి ఇంటి వెనుక పూడ్చేసిన కిరాతకుడు శక్తివేల్ ను పోలీసులు అరెస్టు చేశారు.
-
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications