సల్లుభాయ్ చెల్లెళ్లను వదలని కరోనా.. ఇద్దరికీ వైరస్
కరోనా ఎవరినీ వదలడం లేదు. నా నీ అనే భేదం అసలు ఉండటం లేదు. సెలబ్రిటీలను కూడ వణికిస్తోంది. కరోనా బారినపడి పలువురు ప్రముఖులు కూడా మృత్యువాత పడ్డారు. తాజాగా సల్మాన్ ఖాన్ చెల్లెళ్లు కూడా వైరస్ సోకింది. సల్మాన్ చెల్లెళ్లు అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, అర్పితా ఖాన్ శర్మలకు కరోనా పాజిటివ్ వచ్చింది.
తన చెల్లెళ్లకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని సల్మాన్ వెల్లడించారు. సెకండ్ వేవ్ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ ను తేలిగ్గా తీసుకోవద్దని అభిమానులను హెచ్చరించారు. అల్విరా, అర్పితలకు కరోనా సోకిందని.. దేశంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఎంతో ప్రమాదకరంగా ఉందన్నారు. గతంలో... అక్కడ కరోనా కేసులు వచ్చాయి, ఇక్కడ కరోనా కేసులు వచ్చాయి అని విన్నాం... కానీ సెకండ్ వేవ్ లో మన కుటుంబంలోనూ కరోనా కేసులు వచ్చే పరిస్థితి ఏర్పడిందని సల్మాన్ అన్నారు.
గతేడాది ఇంట్లో డ్రైవర్లకు కరోనా సోకిందని.. ఈసారి చాలామందికి వ్యాపించింది" అని వివరించారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో సాయం చేయండంటూ ప్రతిరోజూ అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. సినీ రంగంలో ఉన్న పాతికవేల మంది కార్మికులకు ఆహారం, ఔషధాలు అందిస్తున్నామని సల్మాన్ ఖాన్ వెల్లడించారు.