శారదా స్కాం: రూ. 1.19కోట్లు తిరిగిచ్చిన మిథున్
కోల్కతా: శారదా గ్రూప్ నుంచి పొందిన రూ. 1.19 కోట్లను బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి)కు తిరిగిచ్చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడైన మిథున్ చక్రవర్తిని, ఈడి ఇటీవలే శారదా కుంభకోణంకు సంబంధించి ప్రశ్నించిన విషయం తెలిసిందే.
విచారణ సందర్భంగా మిథున్ చక్రవర్తి తను పొందిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ మొత్తం సొమ్మును మంగళవారం ఈడికి ఇచ్చేశారు. గత నెలలోనే విచారించిన ఈడి.. మిథున్ చక్రవర్తికి శారదా స్కాంతో సంబంధం లేదని క్లీన్ చీట్ ఇచ్చింది.
శారదా స్కాంలో నష్టపోయిన డిపాజిటర్లకు శారదా గ్రూప్ నుంచి తాను పొందిన మొత్తాన్ని అందజేయాలనే ఉద్దేశంతోనే మిథున్ చక్రవర్తి తన వద్ద ఉన్న రూ. 1.19కోట్లను తిరిగిచ్చేశారని ఈడి పేర్కొంది.

కాగా, తనకు ఎవరినీ మొసం చేసే ఉద్దేశం లేదని ఈడికి మిథున్ చక్రవర్తి వెల్లడించారు. అందుకే తాను శారదా గ్రూప్ నుంచి పొందిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసినట్లు మిథున్ చక్రవర్తి తెలిపారు.
శారదా స్కాంలో డిపాజిటర్లను మోసం చేసి లెక్కలేనంత సొమ్మును కాజేశారనే ఆరోపణలతో టిఎంసికి చెందిన పలువురు ఎంపీలు, మంత్రులను అరెస్ట్ చేసిన ఈడి.. వారిని విచారించింది. దీంతో కొందరు తమ పదవులను కోల్పోవాల్సి వచ్చింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications