ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త: ఎఫ్డీలపై వడ్డీరేటు పెంపు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు మరో శుభవార్త తెలియజేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఎస్బీఐ మరోసారి డిపాజిట్ రేట్లను పెంచేసింది. రిటైల్ వినియోగదారులు రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాల వ్యవధికి చేసిన డిపాజిట్లపై వడ్డీరేట్లను 10 నుంచి 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది.
అంతేగాక, ఏడాది నుంచి రెండేళ్లలోపు కాలావధితో రూ. కోటిపైన చేసిన డిపాజిట్లపై కూడా వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. నేటి నుంచే ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. కాగా.. బల్క్ డిపాజిట్ రేట్లను పెంచడం గత ఐదు నెలల్లో ఇది నాలుగోసారి.

2-3 ఏళ్ల కాలావధి డిపాజిట్లకు వడ్డీరేటును ప్రస్తుతం ఉన్న 6.50శాతం నుంచి 6.60శాతానికి పెంచారు. 3-5 ఏళ్ల కాలావధి డిపాజిట్లకు వడ్డీరేటును 6.50శాతం నుంచి 6.70శాతానికి పెంచారు.
5-10 ఏళ్ల కాలవధి డిపాజిట్లకు వడ్డీరేటును 6.50శాతం నుంచి 6.75శాతం చేశారు. ఇక
బల్క్ డిపాజిట్లకు సంబంధించి రూ.1-10 కోట్ల మొత్తాలకు, 1-2 ఏళ్ల కాలావధికి ప్రస్తుతం ఉన్న 6.75శాతాన్ని 7.00శాతం పెంచారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications