యాసిడ్ బాధితులూ వికలాంగులే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశంలో యాసిడ్ దాడికి గురైన వారందరినీ వికలాంగులుగా పరిగణించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వారందరినీ వికలాంగుల చట్టం పరిధి కిందకు తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు పంపింది.
యాసిడ్ దాడి బాధితులకు వికలాంగుల చట్టం నిబంధనల కింద ఉచిత చికిత్స, ఆపై పునరావాసం, పరిహారం ఇవ్వాలని సోమవారం ఉదయం వెల్లడించింది.

వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. ఇతర అంగవికలురు పొందుతున్న అన్ని రకాల ప్రయోజనాలను వీరికీ కల్పించాలని తెలియజేసింది.
కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి: ముగ్గురు జవాన్లకు గాయాలు
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్నాగ్ జిల్లా బిజ్బెహారాలో సోమవారం ఉదయంస సీఆర్పీఎఫ్ వాహణశ్రేణిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications