మధ్యవర్తిత్వంతో భూ వివాదం పరిష్కరించుకోండి .. అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు
ఢిల్లీ : ఏళ్లుగా సాగుతోన్న అయోధ్య భూ వివాదం మధ్యవర్తిత్వమే పరిష్కరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై నిరోమణి అకారా, రామ్ లాల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు చర్చలతో వివాదానికి తెరపడే అవకాశం ఉందని తెలిపింది.
భూ వివాదంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ కేసు విచారణ కోసం మధ్యవర్తి నియమించే అంశాన్ని నిర్ణయిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణకు మార్చి 5కు వాయిదా వేసింది.

ఏంటీ వివాదం
అయోధ్యలో సున్నీ వక్ఫ్ బోర్డు, నిరోమని అకారా, రామ్ లాల్లా సంస్థల మధ్య 2.77 ఎకరాల భూ వివాదం ఉంది. దీనిపై ఆ సంస్థలు అలహాబాద్ కోర్టును ఆశ్రయించాయి. 2010లో ఇరువురికి సమానస్థాయిలో భూమి పంచుకోవాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మరో 14 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications