పంజాబ్ స్కూల్ బస్సు ప్రమాదంపై కేసు: ప్రిన్సిపల్, వ్యాన్ డ్రైవర్పై హత్యాభియోగాలు నమోదు
పంజాబ్లో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. చిన్నారుల పేరెంట్స్ ఫిర్యాదు మేరకు స్కూల్ ప్రిన్సిపాల్ (యాజమాని) సహా డ్రైవర్పై హత్యాభియోగాలు నమోదుచేశారు. ఇద్దరినీ ఆదివారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. శనివారం సంగ్రూర్లో ప్రైవేట్ స్కూల్ బస్సు చిన్నారులను ఇంటికి దింపే సమయంలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నలుగురు చిన్నారులు చనిపోయారు. వారిలో ఒక చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.

పేరెంట్స్ వార్నింగ్..
ఇప్పుడే కాదు ఇదివరకు కూడా స్కూల్ ప్రిన్సిపాల్ లఖ్విందర్, డ్రైవర్ దల్బీర్ను పేరెంట్స్ హెచ్చరించారని డీఎస్పీ సుఖ్ బిందర్ పేర్కొన్నారు. గతంలో ఆటో ఉండేదని.. దాంతో ఎప్పుడూ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన ఉండేదని గుర్తుచేశారు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు వ్యాన్ సమకూర్చారని.. అదీ పాతది కావడంతో తల్లిదండ్రుల ఆందోళన మరింత ఎక్కువైందన్నారు.

సోమవారం సర్టిఫికేట్..
వ్యాన్ ఫిట్నెస్కు సంబంధించి ఆర్టీఏ నుంచి ధృవపత్రాలను కోరామని, సోమవారం నివేదిక వస్తోందని.. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్, ప్రిన్సిపాల్పై హత్యాయత్నం కింద కేసులు కూడా నమోదు చేశారు.

రూ.లక్ష సాయం..
బస్సు ప్రమాదంలో చనిపోయిన చిన్నారుల ఒక్క కుటుంబానికి శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ రూ. లక్ష ఆర్థికసాయం అందజేస్తామని పేర్కొన్నది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్జీపీసీ చీఫ్ గోబింద్ సింగ్ డిమాండ్ చేశారు.

1990 మోడల్ వ్యాన్
ప్రమాదానికి గురైన బస్సు గురించి కఠోర నిజాలు వెలుగుచూస్తున్నాయి. 1990 మోడల్కి చెందిన వ్యాన్.. ఎల్పీజీ సిలిండర్తో నడుస్తోందని చెప్పారు. స్కూల్ వ్యాన్లో మంటలు చెలరేగిన సమయంలో అందులో12 మంది ఉన్నారు. సమీపంలో గల పొలంలో పనిచేస్తున్న వారు వచ్చి మిగతావారిని కాపాడారు. కానీ అప్పటికే నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications