వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థి ఘాతుకం: రన్నింగ్ బస్సులో.. అందరూ చూస్తుండగానే.. ప్రయాణికుడి గొంతు కోసి..

ఢిల్లీలోని గురువారం మధ్యాహ్నం ఓ బస్సు పంజాబీ బాగ్ నుంచి బాదర్‌పూర్ వెళుతూ స్థానిక ఆశ్రమం చౌక్ వద్ద ఆగింది. కొంతమంది ప్రయాణికులతో పాటు 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు ఉన్న, స్కూలు యూనిఫాంలో ఉన్న విద్య

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: కదులున్న బస్సులోనే కొంతమంది విద్యార్థులు తోటి ప్రయాణికుడితో గొడవ పడ్డారు. వారిలో ఓ విద్యార్థి ఆవేశం పట్టలేక కత్తితీసి ఆ ప్రయాణికుడి మెడపై పొడవగా అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

ఢిల్లీలోని గురువారం మధ్యాహ్నం ఓ బస్సు పంజాబీ బాగ్ నుంచి బాదర్‌పూర్ వెళుతూ స్థానిక ఆశ్రమం చౌక్ వద్ద ఆగింది. కొంతమంది ప్రయాణికులతో పాటు 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు ఉన్న, స్కూలు యూనిఫాంలో ఉన్న విద్యార్థులు ఎక్కారు.

School students slit man's throat on bus in Delhi, manage to escape

లజపత్ నగర్ దగ్గర ఎక్కిన ఓ ప్రయాణికుడు కాసేపటి తరువాత తన ఫోన్ కనిపించడం లేదంటూ అందరి వద్ద వాకబు చేశాడు. ఎవరు తీసుకున్నారో చూపించాలంటూ అతడు అందరి బ్యాగులు వెతికాడు. అందులో భాగంగా ఈ విద్యార్థుల బ్యాగులు కూడా వెతికాడు. దీంతో కోసం తెచ్చుకున్న విద్యార్థులు అతడితో గొడవ పడ్డారు.

ఒక దశలో ఓ విద్యార్థి ఆగ్రహం పట్టలేక తన వద్ద ఉన్న కత్తితో ఆ ప్రయాణికుడి మెడలో పొడవగా అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ గొడవ చూసి డ్రైవర్ బస్సును కాస్త స్లో చేయగానే విద్యార్థులంతా బస్సు నుంచి దూకి పారిపోయారు.

వారి యూనిఫాం చూస్తుంటే స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లా ఉన్నారని బస్సు డ్రైవర్ పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు డీసీపీ రోమిల్ బానియా చెప్పారు. నిందితుల కోసం లజపత్ నగర్-మధుర రోడ్డు వరకు ఉన్న దాదాపు 15 ప్రభుత్వ పాఠశాలల్లో గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

English summary
A group of four or five school students killed a 25-year-old man in Delhi over a row over a stolen mobile phone, police said on Friday. The incident took place on Thursday around 3:30 pm on a bus plying from Punjabi Bagh to Badarpur border. "According to witnesses, the unidentified victim boarded the bus at Lajpat Nagar. When the bus reached Ashram Chowk, the teenagers, aged between 13 and 16 and in school uniform, got in," Deputy Commissioner of Police Romil Baaniya said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X