విద్యార్థి ఘాతుకం: రన్నింగ్ బస్సులో.. అందరూ చూస్తుండగానే.. ప్రయాణికుడి గొంతు కోసి..
ఢిల్లీలోని గురువారం మధ్యాహ్నం ఓ బస్సు పంజాబీ బాగ్ నుంచి బాదర్పూర్ వెళుతూ స్థానిక ఆశ్రమం చౌక్ వద్ద ఆగింది. కొంతమంది ప్రయాణికులతో పాటు 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు ఉన్న, స్కూలు యూనిఫాంలో ఉన్న విద్య
ఢిల్లీ: కదులున్న బస్సులోనే కొంతమంది విద్యార్థులు తోటి ప్రయాణికుడితో గొడవ పడ్డారు. వారిలో ఓ విద్యార్థి ఆవేశం పట్టలేక కత్తితీసి ఆ ప్రయాణికుడి మెడపై పొడవగా అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీలోని గురువారం మధ్యాహ్నం ఓ బస్సు పంజాబీ బాగ్ నుంచి బాదర్పూర్ వెళుతూ స్థానిక ఆశ్రమం చౌక్ వద్ద ఆగింది. కొంతమంది ప్రయాణికులతో పాటు 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు ఉన్న, స్కూలు యూనిఫాంలో ఉన్న విద్యార్థులు ఎక్కారు.

లజపత్ నగర్ దగ్గర ఎక్కిన ఓ ప్రయాణికుడు కాసేపటి తరువాత తన ఫోన్ కనిపించడం లేదంటూ అందరి వద్ద వాకబు చేశాడు. ఎవరు తీసుకున్నారో చూపించాలంటూ అతడు అందరి బ్యాగులు వెతికాడు. అందులో భాగంగా ఈ విద్యార్థుల బ్యాగులు కూడా వెతికాడు. దీంతో కోసం తెచ్చుకున్న విద్యార్థులు అతడితో గొడవ పడ్డారు.
ఒక దశలో ఓ విద్యార్థి ఆగ్రహం పట్టలేక తన వద్ద ఉన్న కత్తితో ఆ ప్రయాణికుడి మెడలో పొడవగా అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ గొడవ చూసి డ్రైవర్ బస్సును కాస్త స్లో చేయగానే విద్యార్థులంతా బస్సు నుంచి దూకి పారిపోయారు.
వారి యూనిఫాం చూస్తుంటే స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లా ఉన్నారని బస్సు డ్రైవర్ పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు డీసీపీ రోమిల్ బానియా చెప్పారు. నిందితుల కోసం లజపత్ నగర్-మధుర రోడ్డు వరకు ఉన్న దాదాపు 15 ప్రభుత్వ పాఠశాలల్లో గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications