అమ్మ అస్తమయంతో.. స్తంభించిన తమిళ జనజీవనం..
పలు స్కూల్స్ కు, ఐటీ సంస్థలకు సెలవులు ప్రకటించడంతో.. షాపులు కూడా మూసివేస్తారనని కొంతమంది ముందే జాగ్రత్తపడ్డారు.
చెన్నై: ఓవైపు వెంటాడుతున్న కరెన్సీ కష్టాలకు తమ ఆరాధ్య నేత అమ్మ అస్తమయంతో తమిళనాట జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది. సీఎం ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏ క్షణాన ఏ విషాద వార్త వినవస్తుందోనన్న ఆందోళన నేపథ్యంలో.. మంగళవారం మొత్తం తమిళనాట ఉద్విగ్న క్షణాలు కొనసాగాయి.
PICS : జయలలిత కు నివాళి
పలు స్కూల్స్ కు, ఐటీ సంస్థలకు సెలవులు ప్రకటించడంతో.. షాపులు కూడా మూసివేస్తారనని కొంతమంది ముందే జాగ్రత్తపడ్డారు. దీంతో పెట్రోలు బంకుల వద్ద భారీ 'క్యూ'లు దర్శనమిచ్చాయి. ఇంటి అవసరాలకు కావాల్సిన కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను మంగళవారం నాడే పలు కొనుగోలు చేసి పెట్టుకున్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెల్ నెట్ వర్క్ సిగ్నల్స్ ను నిలుపుదల చేశారు. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో సెల్ ఫోన్ పనిచేయలేదు. అమెరికా రాయబార కార్యాలయం కూడా వీసా జారీ చేసింది. దీంతో అనేక రాష్ట్రాల నుంచి వీసాల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications