ఎయిరిండియా సిబ్బందిపై చేయి చేసుకున్నయువతి, తిరిగి కొట్టిన సిబ్బంది
ఇటీవల విమానాయాన సంస్థలు, సిబ్బంది దాడులు చేస్తూ వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: ఇటీవల విమానాయాన సంస్థలు, సిబ్బంది దాడులు చేస్తూ వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
'టికెట్ రద్దుకు రూ.3వేలా? చాలా ఎక్కువ, తగ్గించాల్సిందే!'
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు ఓ మహిళ విమానాశ్రయానికి వచ్చింది. ఆలస్యంగా రావడంతో విమానం మిస్సయ్యారు. దీంతో అక్కడ ఉన్న డ్యూటీ మేనేజర్తో సదరు మహిళ వాగ్వాదానికి దిగి మహిళా సిబ్బందిపై చేయి చేసుకుంది. దీంతో వారు కూడా ఆమెపై చేయి చేసుకున్నారు.
ఇండిగో సిబ్బంది పైశాచికం: ప్రయాణికుడిపై కిందపడేసి దాడి(వీడియో)
పోలీసులు, భద్రతా సిబ్బంది చొరవతో గొడవ సద్దుమణినట్లు ఎయిరిండియా అధికారి తెలిపారు. విమాన సిబ్బందిపై ప్రయాణికులు దాడి చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. విమాన సిబ్బంది కూడా ప్రయాణికులపై దాడులకు పాల్పడ్డ ఘటనలూ చోటు చేసుకున్నాయి.