అమెరికాలో భారతీయ విద్యార్థి షాలిని మృతి
అమెరికాలోని టెక్సాస్ నగరంలో హర్వే తుఫాన్ కారణంగా షాలినిసింగ్ అనే భారతీయ విద్యార్థి చనిపోయింది.వరదల్లో కొట్టుకుపోతున్న షాలినిసింగ్ను కాపాడి చికిత్స జరిపిన ఆమె మరణించింది.
న్యూఢిల్లీ: అమెరికాలోని టెక్సాస్ నగరంలో భారతీయ విద్యార్థిని షాలిని చనిపోయింది. హర్వే తుపాన్ కారణంగా ఆమె చనిపోయినట్టు అధికారుల ప్రకటించారు.అమెరికాలోని టెక్సాస్ ను హార్వీ తుపాను వణికించిన సంగతి తెలిసిందే.
ఈ తుపానును అమెరికా ప్రభుత్వం పెను ఉపద్రవంగా అభివర్ణించింది. ఎంతో మందిని పొట్టనపెట్టుకున్న హార్వీ తుపాను... అక్కడి యూనివర్శిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని షాలిని సింగ్ (25) ప్రాణాలను కూడా బలిగొంది. తుపాను సమయంలో వరదలో కొట్టుకుపోతున్న నిఖిల్ భాటియా, షాలిని సింగ్ లను కొందరు కాపాడి ఆసుపత్రికి తరలించారు.

వారికి అత్యవసర చికిత్స అందించారు. అయితే ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. ఢిల్లీకి చెందిన షాలిని గత నెలలోనే అమెరికాకు వెళ్ళింది. డెంటల్ సర్జరీలో డిగ్రీ చేసిన ఆమె అక్కడి యూనివర్శిటీలో పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.
మొత్తం 200 మంది భారతీయ విద్యార్థులు వరదలలో చిక్కుకున్నారు. అయితే, మిగిలిన వారు మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా చనిపోయినవారిలో ఇద్దరు భారతీయ విద్యార్థులు కావడం గమనార్హం.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications