ఆ తర్వాతే రాజద్రోహంపై ఎఫ్ఐఆర్- సుప్రీంకోర్టులో కేంద్రం కీలక ప్రతిపాదన
దేశవ్యాప్తంగా రాజద్రోహం కేసుల నమోదు తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. చట్టం పరిధిలో రాజద్రోహం కేసులు నమోదు కావడం లేదనే వాదనల నేపథ్యంలో ఈ కాలం చెల్లిన బ్రిటీష్ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు కేంద్రం నిర్ణయం తీసుకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
దేశద్రోహ చట్టం కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టుకు చట్టం పునఃపరిశీలన కోసం కేంద్రం ముసాయిదాను సిద్ధం చేసిందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇవాళ వెల్లడించారు. ఎస్పీ స్థాయి పోలీసు అధికారి సరైన కారణం చెబితేనే దేశద్రోహ ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఈ ముసాయిదా పేర్కొంది. చట్ట పరిధిలో శిక్షించే నేరం జరిగిన చోట రాజ్యాంగ న్యాయస్ధానం దీనిపై స్టే ఇవ్వడం సరికాదని తుషార్ మెహతా వాదించారు. జ్యుడీషియల్ అథారిటీ కింద బాధ్యతాయుతమైన సీనియర్ అధికారి దీనిపై పరిశీలన చేసే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.

దేశద్రోహ చట్టం ప్రయోగానికి సంబంధించి పెండింగ్లో ఉన్న కేసుల గురించి మాట్లాడుతూ, ఇది గుర్తించదగిన నేరమని , పెండింగ్లో ఉన్న ప్రతి నేరం తీవ్రత తమకు తెలియదన్నారు. ఉగ్రవాదం, మనీలాండరింగ్ లేదా మరేదైనా నేరం ఉండవచ్చని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిందితులు బెయిల్ దరఖాస్తు చేసుకున్నప్పుడు కోర్టు ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉందని, కానీ పూర్తిగా సెక్షన్ 124ఏను నిలిపివేయడం సరికాదని మెహతా అన్నారు.
మహాత్మాగాంధీని అడ్డుకోవడానికి బ్రిటీష్ వారు వాడిన రాజద్రోహం చట్టాన్ని మీరు ఇంకా కొనసాగించాలనుకుంటున్నారా అని గతంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించంది. దేశద్రోహ చట్టాన్ని దుర్వినియోగం చేయడం, దానిని ఉపయోగించడంలో ఏజెన్సీల జవాబుదారీతనంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ చట్టం దుర్వినియోగానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది.
-
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
ఎస్సీ రిజర్వేషన్లు రద్దు!: సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
Women's Reservation Act: మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం రెడీ..! త్వరలో..! -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications