షాకింగ్: సెల్ఫీ విత్ మోడీ, బిజెకి ఖర్చు రూ.1 కోటి
ఢిల్లీ: ప్రధాని మోడీ పేరు చెప్పగానే సెల్ఫీ గుర్తుకు వస్తుందని చెప్పవచ్చు. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ ఎన్నికల సందర్భంగా 'సెల్ఫీ విత్ మోడీ' అనే వినూత్న కార్యక్రమానికి బిజెపి నాయకులు శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని అన్ని నియోజకవర్గాలలో మొత్తం ఏడు విడతలుగా ఈ కార్యక్రమం సాగింది.
ఈ కార్యక్రమంలో తాత్కాలిక బూత్లను, వాటిలో మోడీ వర్చువల్ ఇమేజ్ (కాల్పనిక చిత్రం)ను ఏర్పాటు చేశారు. ఆ ఇమేజ్తో సెల్ఫీ తీసుకుంటే స్వయంగా మోడీనే మన పక్కను ఉన్నట్లు కనిపిస్తుంది. లక్షలాది ఢిల్లీ ప్రజలు మోడీతో సెల్ఫీలు దిగి ఆ గుర్తును భద్రంగా ఉంచుకన్నారు.

అయితే, ఈ మోడీ విత్ సెల్ఫీ కార్యక్రమానికి మొత్తం రూ.కోటికి పైగా అయినట్లు లెక్క తేలింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఖర్చుల జాబితాలో బిజెపి పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ 700కు పైగా 3డీ ర్యాలీలలో ప్రసంగించారు.












Click it and Unblock the Notifications