కరోనా కంటే కంగనా ఎక్కువైంది - దావూద్ ఆస్తుల్ని కూల్చేసే దమ్ముందా? : శివసేనపై బీజేపీ ఫైర్
కరోనా మహమ్మారికి సంబంధించి దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా కొనసాగుతోంది మహారాష్ట్ర. అయితే శివసన కూటమి సర్కారు ప్రాధాన్యం మాత్రం కరోనా కు కాకుండా కంగనా రనౌంత్ కే ఇస్తున్నట్లుగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పక్షనేత దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. శుక్రవారం ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా, కంగనా ఇష్యూలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా విలయం..
మహారాష్ట్రలో కేసుల సంఖ్య అక్షరాలా 10 లక్షలకు చేరువైంది. గడిచిన వారం రోజులుగా ఏనాడూ పాతిక వేలకు తగ్గకుండా కొత్త కేసులు వస్తున్నాయి. ఇప్పటికే కేసులు 9.90లక్షలు కాగా, శుక్రవారం నాటి బులిటెన్ లోనే మిలియన్ మార్క్ దాటనుంది. అంతేకాదు, కొవిడ్ మరణాల్లోనూ మహారాష్ట్ర ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఇక్కడ కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 29వేలకు చేరువైంది. కరోనా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే శివసేన కూటమి సర్కారుకు చీమకుట్టినట్లైనా లేదని ఫడ్నవిస్ మండిపడ్డారు.

50 శాతం శ్రద్ధ పెట్టినా..
‘‘దేశంలో కరోనా వల్ల చనిపోయినవారిలో 40 శాతం మంది మహారాష్ట్రవాళ్లే. ప్రతిరోజూ 25 నుంచి 30వేల కొత్త కేసులు వస్తున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రంగా కొనసాగుతున్నాం. కానీ ఉద్ధవ్ ఠాక్రే సర్కారు మాత్రం కరోనాను వదిలేసి, కంగనాతో పోట్లాడుతోంది. ఆ విషయంలో చూపుతోన్న శ్రద్ధలో కనీసం 50 శాతం కరోనాపై పెట్టినా మహారాష్ట్రలో మరణాలు తగ్గి ఉండేవి'' అని ఫడ్నవిస్ అన్నారు.

దావూద్ బంగళా కూల్చుగలరా?
శివసేన చేస్తోన్న అతికి నటి కంగనా రనౌత్ రియాక్షన్ మాత్రమే ఇస్తున్నారని, నోటీసులు ఇవ్వకుండా బిల్డింగ్ కూల్చడం ద్వారా ఆమెను భయపెట్టడానికే సేన ప్రయత్నం చేసిందని ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ‘‘కంగనా రనౌత్ రాజకీయ నేత కాదు. అలాంటప్పుడు ఆమె కామెంట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, వ్యవహారాన్ని ఇంత పెద్దది చేయడం శివసేనకు అవసరమా? అక్రమ కట్టడాలపై చర్యలంటే మరి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇంటిని, ఆస్తుల్ని కూడా కూల్చేయగలరా?'' అని ఫడ్నవిస్ సవాలు విసిరారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications