మమతకు కలకత్తా హైకోర్టు షాక్-ఎన్నికల తర్వాత హింసపై ఎన్హెచ్ఆర్సీ విచారణ
పశ్చిమబెంగాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. వరుసగా మూడోసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తృణమూల్ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎన్నికల్లో తమకు గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. దీంతో దాదాపు 12 మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారు.
పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసపై కేంద్రం నివేదిక కోరినా, గవర్నర్ ఆక్షేపణ తెలిపినా స్పందించని మమతా బెనర్జీ సర్కారుకు ఎన్హెచ్ఆర్సీ షాకిచ్చింది. ఎన్నికల తర్వాత హింసపై దర్యాప్తుకు సిద్ధమైంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన మమతా సర్కారుకు చుక్కెదురైంది. ఈ పిటిషన్ను విచారించిన ఐదుగురు సభ్యుల హైకోర్టు ధర్మాసనం... మమతా సర్కార్ అభ్యర్దనను తోసిపుచ్చింది. జూన్ 18న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సంతృప్తి పర్చడంలో బెంగాల్ సర్కార్ విఫలమైనందున ఎన్హెచ్ఆర్సీ విచారణకు ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Recommended Video
ఎన్నికల హింసను అరికట్టడంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కోర్టుకు వివరించేందుకు తగినంత సమయం ఇవ్వలేదని మమతా బెనర్జీ సర్కారు ఆక్షేపించింది. అయితే హైకోర్టు ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏడుగురు సభ్యుల ఎన్హెచ్ఆర్సీ బృందం బెంగాల్లో ఎన్నికల అనంతర హింసపై విచారణ జరపబోతోంది. దీన్నిఅడ్డుకునేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో మమతా బెనర్జీ సర్కారు ఇరుకునపడక తప్పలేదు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications