ముంబైలో ఘోర్ అగ్నిప్రమాదం: 20 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు, ఏడుగురు మృతి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని, మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
Yet another fire broke out at a #Mumbai highrise this morning. 2 persons died & 15 are injured.
— Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) January 22, 2022
As usual, excuses will be made, sketchy reasons given & life will go on.
Strongest political will required if the city has to survive. As a Mumbaikar, the unaccountability pains!! pic.twitter.com/lx95sPqcg2
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్ ముంబైలోని తాడ్దేవ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న 20 అంతస్తుల కమలా భవనంలోని 18వ అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పివేశాయి. మంటల్లో కాలిపోయి ఏడుగురు చనిపోయారు. కాలినగాయాలతో ఘటనా స్థలంలో పడివున్న పలువురిని పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులు భాటియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 13 ఫైరింజిన్లు, 7 వాటర్ జెట్టీలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. మంటలతోపాటు భారీ ఎత్తున పొగ అలుముకోవడంతో అపార్ట్మెంట్లోని వారందరినీ పోలీసులు బయటకు పంపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ముంబై అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేగాక, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications