పీటర్ రిమాండ్ పొడిగింపు: ఇంటిభోజనానికి దరఖాస్తు
ముంబై: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బొరా హత్య కేసులో సిబిఐ రిమాండులో ఉన్న స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖార్జియాకి ఇంటి భోజనం అందించేందుకు అనుమతివ్వాలని ఆయన తరఫు న్యాయమూర్తి కోర్టులో దరఖాస్తు చేశారు. పీటర్ వృద్ధుడని, ఆయనకు గుండె సంబంధిత జబ్బులు ఉన్నాయని, కొలెస్ట్రాల్ ఎక్కువకావడం వల్ల వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు.
ఈ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇంటి భోజనాన్ని అనుమతించాలని ఆయన లాయర్ కుశాల్ మోర్ కోర్టును అభ్యర్థించారు. ఈ విషయమై సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కవితా పాటిల్ మాట్లాడుతూ.. రిమాండులో ఉన్నవారిపై సిబిఐ బాధ్యతగానే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఈ దరఖాస్తుపై కోర్టు మంగళవారం స్పష్టతనిచ్చే అవకాశాలు ఉన్నాయి.

పీటర్ ముఖార్జియాకి రిమాండు పొడిగింపు
ఇది ఇలా ఉండగా షీనాబోరా హత్య కేసులో పీటర్ ముఖార్జియాకి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. డిసెంబర్ 28 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు సోమవారం ఉదయం ముంబై మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
షీనా బోరా కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేయగా న్యాయస్థానం ఆయనకు జుడీషియల్ కస్టడీ విధించింది. సోమవారంతో 14 రోజుల కస్టడీ పూర్తికావడంతో కోర్టు మళ్లీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications