శిల్పా షెట్టి షాకింగ్- ముంబై పోలీసులకు రాజ్ కుంద్రా గురించి నిజాలు-ఛార్జిషీట్ లో వెల్లడి
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఆమె భర్తతో పాటు పలువురిపై అభియోగాలు మోపారు. అలాగే శిల్పాషెట్టి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. అయితే ఇందులో ఆమె తన భర్త గురించి, అతనితో ఏర్పడిన పరిచయం, సాన్నిహిత్యం గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు
బాలీవుడ్ నటి శిల్పాషెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో ఇరుక్కున్నాడు. ఆయనపై ఇప్పటికే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. పోర్న్ వీడియోలు తయారు చేసి విక్రయించే ముఠాతో రాజ్ కుంద్రాకు ఉన్న సంబంధాలతో పాటు పలు అంశాలపై ఇందులో పోలీసులు ప్రస్తావనకు తెచ్చారు. అదే సమయంలో ఆయన భార్య శిల్పా శెట్టి వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా చెప్పిన పలు విషయాలను కూడా ఈ ఛార్జిషీట్ లో పోలీసులు ప్రస్తావించారు. ఇవి కాస్తా బయటికి పొక్కడంతో సంచలనం రేగుతోంది.
శిల్పా శెట్టి షాకింగ్ కామెంట్స్
భర్త రాజ్ కుంద్రాకు పోర్న్ రాకెట్ కేసుకూ ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రయత్నిస్తున్న సందర్భంగా వాంగ్మూలం ఇచ్చిన శిల్పా షెట్టి షాకింగ్ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రాజ్ కుంద్రా ఏం చేశాడో తనకు తెలీదంటూ ఇప్పటివరకూ చెప్తూ వస్తున్న శిల్పా షెట్టి దీనికి అదనంగా మరికొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ముంబై క్రైమ్ బ్రాంచ్ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో ఆయా అంశాలు ప్రస్తావనకు రావడంతో కలకలం రేగుతోంది.
నేను బిజీ-రాజ్ ఏం చేశాడో తెలీదన్న శిల్పా
తాను బిజీగా ఉంటానని, ఆ సమయంలో రాజ్ కుంద్రా ఏం చేసేవాడో తనకు తెలియదని శిల్పా శెట్టి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వాంగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది. తన వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉన్న సమయంలో రాజ్ కుంద్రా ఇదంతా చేసి ఉండొచ్చనేది ఆమె వ్యాఖ్యల బట్టి తెలుస్తోంది. నేను నా స్వంత పనిలో బిజీగా ఉన్నానని, తన భర్తను అతనేం చేస్తాడో అడగనను, తాను కూడా చెప్పడని శిల్పా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా తమ ఛార్జిషీట్ లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో పాటు శిల్పా చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కూడా ఛార్జిషీట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
శిల్పా బయటపెట్టిన విషయాలివే...
పోర్న్ రాకెట్ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది, రాజ్ కుంద్రా, అతని సంస్థ ఐటి హెడ్ ర్యాన్ థోర్ప్, మరో ఇద్దరు నిందితులు, యశ్ ఠాకూర్ అలియాస్ అరవింద్ శ్రీవాస్తవ, సింగపూర్ నివాసి, కుంద్రా సోదరుడు, లండన్ నివాసి అయిన పర్దీప్ బక్షిగా గుర్తించారు. క్రైమ్ బ్రాంచ్ అధికారులకు తన ప్రకటనలో, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా 2019 లో భాగస్వామిగా సౌరవ్ కుష్వాహతో ఆర్మ్స్ప్రైమ్ మీడియా అనే సంస్థలో చేరారని తెలిపింది. పూనమ్ పాండే వంటి యాక్టర్ల వీడియోలను ఆర్మ్స్ప్రైమ్ మీడియా ప్రసారం చేస్తుంది అదీ వారు తమ కోరికపై బయటపెట్టిన వీడియోల్ని మాత్రమేనని శిల్పా తెలిపింది. శిల్పాశెట్టి తాను రాజ్ కుంద్రాను దాని గురించి అడిగానని, దానికి అతను OTT ప్లాట్ఫామ్ బాగా పనిచేస్తోందని, మంచి లాభాలు ఆర్జిస్తున్ననట్లు చెప్పినట్లు పేర్కొంది. అలాగే రాజ్ కుంద్రా అరెస్టుకు కారణమైన బోలీఫేమ్ అనే యాప్ గురించి తనకు ఏమీ తెలియదని శిల్పా చెప్పింది. తాను యూకేలో ఉన్నప్పుడు, బిగ్ బ్రదర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫరత్ హుస్సేన్ అనే స్నేహితుడి ద్వారా రాజ్ కుంద్రాను తొలిసారి కలిశానని చెప్పింది. వారి సంబంధం 2009 లో వివాహంగా మారింది. అప్పటి నుండి రాజ్ కుంద్రా భారత్ లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తెలిపింది.