Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బోగీలను వదిలిపోయిన శివగంగా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి మరువాడీకి వెళుతున్న శివగంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్.. దానికి చెందిన బోగీల నుంచి విడిపోయి కొంత దూరం వరకు వెళ్లిపోయింది. దీంతో 6కుపైగా రైళ్లను నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన జంగీగంజ్‌, అత్రౌలా రైల్వే స్టేషన్‌ల మధ్య చోటు చేసుకుంది.

సోమవారం ఉదయం 9:10 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగిందని గ్యాన్‌పూర్‌ స్టేషన్‌ మాస్టర్‌ అశోక్‌ కుమార్‌ వర్మ తెలిపారు. రైలు తక్కువ వేగంతో ఉన్నప్పుడు బోగీల నుంచి ఇంజను విడివడిందని చెప్పారు.

Shiv-Ganga express engine decouples on Allahabad-Varanasi route in UP

దీంతో ప్రమాదం తప్పిందని లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఆ మార్గంలో నడవాల్సిన అరడజను రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు.

ఆ తర్వాత మరో ఇంజన్‌ని తెప్పించి బోగీలకు కలిపి 10:34 నిమిషాలకు రైలును అక్కడి నుంచి గమ్యస్థానానికి పంపించినట్లు అశోక్ కుమార్ వర్మ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+