Shock: భార్యను లేపుకుపోయిన భర్త, కేసు పెట్టిన ఫ్యామిలీ, మార్కెట్ లో ముష్టియుద్దం, తలపట్టుకున్న పోలీస్ !
అహమ్మదాబాద్/గుజరాత్: ఒకే ప్రాంతంలో ఉంటున్న రెండు కుంటుంబాలు చాలా సంవత్సరాల నుంచి అన్యోన్యంగా ఉంటున్నారు. సమీప బంధువులు అయిన కుటుంబాల్లో ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఇద్దరి పెళ్లి జరిపించేశారు. అయితే ఆ సమయంలో అమ్మాయి మైనర్ కావడంతో కథ రసవత్తరంగా మారింది. ఈ స్టోరీ జరుగుతున్న సమయంలో భార్యను ఆమె భర్త లేపుకుపోయాడు. అంతే అబ్బాయి కుటుంబ సభ్యులు, అమ్మాయి కుటుంబ సభ్యులు సూర్యానగర్ కూరగాయల మార్కెట్ దగ్గర గొడవకు దిగారు. ఇనుపరాడ్లు, కర్రలతో రెండు వర్గాలు దాడి చేసుకోవడంతో ఆరు మందికి తీవ్రగాయాలు అయ్యాయి. భార్యను ఆమె భర్త కిడ్నాప్ చేశాడని కేసు పెట్టడంతో పోలీసులు బిత్తరపోయారు. ఇప్పుడు ఈ కథ అక్కడ హాట్ టాపిక్ అయ్యింది.

ఫ్యామిలీ ఫ్రెండ్స్..... దగ్గర బంధువులు
గుజరాత్ లోని ఓధావ్ ప్రాంతంలో గోవింద్ ప్రజాపతి (23) అనే అబ్బాయి, లక్ష్మీ ప్రజాపతి (19) (ఇద్దరికి ప్రస్తుతం ఇంత వయసు ఉంది) అనే అమ్మాయి నివాసం ఉంటున్నారు. గోవింద్ ప్రజాపతి, లక్ష్మీ ప్రజాపతి కుంటుంబాలు చాలా సంవత్సరాల నుంచి అన్యోన్యంగా ఉంటున్నారు. రెండు కుటుంబాలు సమీప బంధువులు కావడంతో వాళ్ల మద్య రాకపోకలు ఎక్కువ అయ్యాయి.

మైనర్లకు పెళ్లి చేశారు
అమ్మాయి లక్ష్మీకి అబ్బాయి గోవింద్ కు పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. 2013లో రెండు కుటంబాల కోరిక మీరకు గోవింద్, లక్ష్మీల పెళ్లి జరిపించేశారు. అయితే ఆ సమయంలో గోవింద్, లక్ష్మీలు మైనర్ అయినా వాళ్ల కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్థానికులు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఫ్యామిలీ ఫైటింగ్
మైనర్ దంపతులు గోవింద్, లక్ష్మీ కొన్ని సంవత్సరాలు కాపురం చేశారు. తరువాత గోవింద్, లక్ష్మీ కటుుంబ సభ్యుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దల గొడవతో మైనర్ దంపతులు గోవింద్, లక్ష్మీ విడిపోయారు. మైనర్ కోడలు లక్ష్మీని ఆమె పుట్టింటికి పంపించేశారు. మేము అడిగిన బంగారు నగలు, కట్నం తీసుకు వస్తేనే మా కొడుకు గోవింద్ తో కాపురం చెయ్యడానికి లక్ష్మీకి అవకాశం ఇస్తామని అతని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

భార్యను లేపుకుపోయిన భర్త
లక్ష్మీ కుటుంబ సభ్యులు గోవింద్ ఫ్యామిలీ అడిగిన బంగారు నగలు సరైన సమయంలో ఇవ్వలేకపోయారు. ఈ స్టోరీ జరుగుతున్న సమయంలో కథ రసవత్తరంగామారిపోయింది. తన స్నేహితురాలి ఇంటికి వెలుతున్నానని, సాయంత్రం వస్తానని చెప్పిన లక్ష్మీ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరువాత భర్త గోవింద్ కు ఫోన్ చేసిన లక్ష్మీ ఓ రహస్య ప్రాంతంలో కలిశారు. అక్కడి నుంచి గోవింద్, లక్ష్మీ దంపతులు గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయారు.

నడిరోడ్డులో రచ్చరచ్చ..... ఇనుపరాడ్లతో దాడులు
భార్య లక్ష్మీని ఆమె భర్త గోవింద్ లేపుకుపోవడంతో అబ్బాయి కుటుంబ సభ్యులు రగిలిపోయారు. అంతే గోవింద్ కుటుంబ సభ్యులు, లక్ష్మీ కుటుంబ సభ్యులు సూర్యానగర్ కూరగాయల మార్కెట్ దగ్గర గొడవకు దిగారు. ఇనుపరాడ్లు, కర్రలతో రెండు వర్గాలు దాడి చేసుకోవడంతో ఆరు మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. భార్య లక్ష్మీని ఆమె భర్త గోవింద్ కిడ్నాప్ చేశాడని కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. భార్య లక్ష్మీని ఆమె భర్త గోవింద్ కిడ్నాప్ చేశాడని కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో పోలీసులు బిత్తరపోయారు. ఇప్పుడు ఈ కథ అక్కడ హాట్ టాపిక్ అయ్యింది
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications