Shock: తల్లీ కూతురి మీద గ్యాంగ్ రేప్, భర్తను కట్టేసి అరాచకం, రివాల్వర్లతో బెదిరించి, రౌడీరాజ్యంలో !
లక్నో/చెన్నై: ఇంట్లో వేడిగా ఉందని కుటుంబ సభ్యులు అందరూ ఇంటి బయట నిద్రపోయారు. అర్దరాత్రి ముఖానికి మాస్కులు వేసుకుని వచ్చిన ముగ్గురు కామాంధులు ఇంటి యజమానిని నిద్రలేపారు. నిద్రలేచిన ఇంటి యజమాని తల మీద రివాల్వర్లు గురిపెట్టిన నిందితులు అందర్ని ఇంట్లోకి లాక్కెళ్లారు. ఇంటి యజమానికి తాళ్లతో కట్టేసి అతని భార్య, కుతురిని నగ్నంగా తయారు చేశారు. భర్త కళ్ల ముందే అతని భార్యను, కుమార్తెను ఉదయం వరకు సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెప్పినా, పోలీసు కేసు పెట్టినా మరుసటి రోజు మళ్లీ వచ్చి మిమ్మల్ని ఇదే రివాల్వర్లతో కాల్చి చంపేస్తామని రౌడీరాజ్యంలో బెదిరించడం కలకలం రేపింది.

ఇంట్లో వేడిగా ఉందని !
నేరసామ్రాజ్యానికి కేంద్ర బింధువు అయిన ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ లో రంజిత్, రష్మీ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. రంజిత్, రష్మీ దంపతులకు 12 సంవత్సరాల కుమార్తె ఉంది. రాత్రి ఇంట్లో వేడిగా ఉందని కుమార్తెతో కలిసి రంజిత్, రష్మీ దంపతులు ఇంటి బయట నిద్రపోయారు.

అర్దరాత్రి రివాల్వర్లతో వచ్చి ?
అర్దరాత్రి ముగ్గురు నిందితులు రంజిత్ ఇంటి దగ్గరకు వెళ్లారు. రంజిత్ ను నిద్రలేపిన నిందితులు అతని తల మీద రివాల్వర్లు పెట్టి బెదిరించారు. రంజిత్ భార్య, అతని కుమార్తెను నిద్రలేపి ముగ్గురిని ఇంటిలోపలకు పిలుచుకుని వెళ్లి ఇంటి లోపల తలుపు లాక్ చేశారు. రంజిత్ ను, అతని భార్య, కుమార్తె కేకలు వేస్తే చంపేస్తామని రివాల్వర్లతో బెదిరించారు.

తల్లీ, కూతురి మీద గ్యాంగ్ రేప్
ఇంట్లో రంజిత్ ను తాళ్లతో కట్టేసిన నిందితులు అతని భార్య, కుమార్తెను నగ్నంగా చేసి ఇద్దరిని లేంగిక వేధింపులకు గురి చేశారు. భర్త కళ్ల ముందే అతని భార్య, కుమార్తె మీద ముగ్గురు కామాంధులు పదేపదే గ్యాంగ్ రేప్ చేశారు. ఎవరు కేకలు వేసినా అందర్ని చంపేస్తామని బెదిరించి వాళ్లు కేకలు వెయ్యకుండా చేశారు. ఉదయం వరకు తల్లీ కూతురిని రేప్ చేసి కామం తీర్చుకున్నారు.

కేసు పెడితే అదే రోజు రాత్రి చంపేస్తాం
వేకువ జామున చుట్టుపక్కల వాళ్లు నిద్రలేవకముందే కామాంధులు ఇంటి నుంచి బయటకు వెళ్లి పోవాలని డిసైడ్ అయ్యారు. నీ భార్య, కుమార్తె మీద మేము అత్యాచారం చేశామని ఎవరికైనా చెప్పినా, పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టినా అదే రోజు రాత్రి వచ్చి తుపాకులతో కాల్చి చంపేస్తామని కామాంధులు రంజిత్, అతని భార్యకు వార్నింగ్ ఇచ్చారు.

సర్లే.... జరిగిందేదో జరిగిపోయింది..... వెళ్లిపోండి
మరుసటి రోజు ఉదయం రంజిత్ అతని భార్య, కుమార్తెను వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్ వెళ్లి జరిగిన దారుణంగా గురించి ఫిర్యాదు చేశారు. అసలే టైమ్ బాగాలేని ఈరోజుల్లో మీరెందుకు బయట పడుకున్నారు ? తప్పు మీదే, జరిగిందేదో జరిగింది, సర్లే వెళ్లిపోండి కేసులు ఎందుకు అని స్థానిక పోలీసులు కేసు నమోదు చెయ్యకుండా నిర్లక్షం చేశారు.

కామాంధుడు ఒక్కడు చిక్కాడు
రంజిత్ అతని కుటంబ సభ్యులు మోరదాబాద్ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ చివాట్లు పెట్టడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తల్లీ కుమార్తె మీద గ్యాంగ్ రేప్ చేసిన కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారని, మిగిలిన ఇద్దరి కోసం పోలీసుు గాలిస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications