వేధింపుపై ఎంపీ 'సారీ': శ్వేతా గంటల్లో ఫిర్యాదు వెనక్కి
ఎంపి పీతాంబర కురుప్ ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడంతో ఆమె వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన శ్వేతా మీనన్ వేరే వ్యక్తి వేధించినట్లుగా ఉన్న కొన్ని చిత్రాలను ఆధారాలుగా చూపించారని సమాచారం.
కాగా, ఎంపి పీతాంబర తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన ప్రముఖ నటి శ్వేతా మీనన్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం కొచ్చిలో శ్వేతా మీనన్ స్టేట్మెంట్ను పోలీసులు తీసుకున్నారు. కొల్లం నుండి ఆదివారం పోలీసు టీం కొచ్చికి వచ్చింది. టీంలో మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు.
వీరు ఉదయం తొమ్మిది గంటలకు శ్వేత ఇంటికి వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు. రిపోర్టును బహిర్గతపర్చేందుకు పోలీసులు నిరాకరించారు. సమాచారం మేరకు శ్వేతా మీనన్... ఇద్దరి పేర్లను చెప్పినట్లుగా తెలుస్తోంది. అందులో ఎంపి కురుప్ పేరు ఉందని వార్తలు వచ్చాయి. కానీ మరో వ్యక్తి వేధించినట్లుగా ఆమె చిత్రాలను ఆధారాలుగా చూపినట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి.