Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీకి షాక్ ఇచ్చిన సీఎం, రిటైడ్ జడ్జ్ తో విచారణ, 40 శాతం కమీషన్ దెబ్బతో !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లే చేస్తోందని, బీజేపీ ప్రభుత్వం చేసిన 40% కమీషన్‌ కుంభకోణాన్ని రిటైర్డ్‌ జస్టిస్‌ బి. వీరప్ప నేతృత్వంలోని న్యాయ విచారణకు అప్పగించామన్నారు. దీనిపై వరుస ట్వీట్ల ద్వారా సమాచారం అందించిన సీఎం సిద్ధరామయ్య బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చారు. బెంగళూరు నగరంలో కాంట్రాక్టర్ల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీకి 40% కమీషన్ ఇచ్చామని ఆరోపించారు.

సిద్ధరామయ్య గతంలో బీజేపీ 40% కమీషన్ కుంభకోణం కేసును న్యాయ విచారణకు అప్పగిస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేం అధికారంలోకి వస్తే కర్ణాటకలో గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలపై విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చామని సీఎం సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలోని ఓటర్లు మా మాటలు నమ్మి బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశారని, 1035 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, సురక్షితమైన, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాని సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు.

Siddaramaiah is investigating the BJP governments 40 percent commission with a retired judge
బీజేపీ ప్రభుత్వం 40% కమీషన్ స్కామ్ బయటపెట్టడానికి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం మన కర్తవ్యం, రిటైర్డ్ జస్టిస్ బి. వీరప్ప నేతృత్వంలోని న్యాయ విచారణకు అప్పగించామని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఎస్ఐ స్కామ్‌, బిట్‌ కాయిన్‌, చామరాజనగర్‌ ఆక్సిజన్‌ ​​డిజాస్టర్‌ సహా కోవిడ్‌ కుంభకోణాలపై దర్యాప్తు చేస్తామని గతంలో సిద్దరామయ్య బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే.

బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పనులు, పాత పనులకు కొన్నిచోట్ల అరకొర పనులు చేసి బిల్లులు చెల్లించారు. రిటైర్డ్ జస్టిస్ బి. వీరప్ప నేతృత్వంలోని జ్యుడీషియరీ కమిటీతో ఈ కుంభకోణాలపై విచారణ చేస్తోందని, విచారణ పూర్తికాకముందే బకాయి బిల్లులను విడుదల చేయడం సమంజసం కాదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.

Siddaramaiah is investigating the BJP governments 40 percent commission with a retired judge

న్యాయంగా పనులు చేసిన ఏ కాంట్రాక్టర్‌కు కూడా మా ప్రభుత్వం అన్యాయం చేయదు. దీనికి కాంట్రాక్టర్లు భయపడక్కర్లేదు, అయితే ఉప్పు తిన్నవాళ్లు నీళ్లు తాగల్సిందే అని, మా ప్రభుత్వంపై మాజీ మంత్రి. అశోక్ 15% కమీషన్ ఆరోపణ అసత్యం అని, ఆయన కమీషన్ రేటును 40% నుండి 15%కి తగ్గించడం విశేషం అని సీఎం సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు.

మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు అశోక్ చెప్పిన ఈ మాటతో ఆయన మనసులో బీజేపీ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. మాపై వచ్చిన ఆరోపణలను సవాల్‌గా స్వీకరించి, ఈ పరీక్షలో విజయం సాధిస్తామని, మాది ఉత్తమ పాలన, పారదర్శకమై ప్రభుత్వం అని నిరూపించుకుంటటామని సిద్దరామయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బకాయి బిల్లులు చెల్లించడం లేదని, రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని కాంట్రాక్టర్ల బిల్లుల డబ్బులు విడుదల చేయాలని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+