పట్టు పంచె, బంగారు వర్ణ కుర్తా, మెడలో పట్టు వస్త్రంతో మెరిసిపోతున్న ప్రధాని మోడీ
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కాసేపట్లో భూమి పూజ జరగనుంది. అయోధ్య పుర వీధులు రామనామస్మరణతో మారుమోగిపోతోంది. జై శ్రీరాం అనే నినాదాలు నలు దిక్కులు పిక్కటెల్లేలా వినిపిస్తున్నాయి. మందిర భూమి పూజ కోసం ముఖ్య అతిథి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. షెడ్యూల్ ప్రకారం అయోధ్యకు చేరుకుంటారు. మరోవైపు అయోధ్యకు ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేరుకొని.. భూమిపూజ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Prime Minister Narendra Modi leaves for #Ayodhya to take part in #RamTemple event.
— ANI (@ANI) August 5, 2020
(Photo source: PMO) pic.twitter.com/VU9uGmzdJB
.
అయోధ్యలో రామ మందిర నిర్మాణ మహోత్తర ఘట్టానికి శ్రీకారం చుడుతోన్న ప్రధాని మోడీ ప్రత్యేకంగా తయారయ్యారు. బంగారు వర్ణంలో గల పట్టు పంచె ధరించారు. పైన కుర్తా కూడా బంగారు వర్ణంతో మెరిసిపోతోంది. మెడలో కూడా పట్టు పంచె వేసుకొని సంప్రాదాయబద్దంగా కనిపించారు. భారతీయ సాంప్రదాయాలకు ప్రతీకగా తయారై.. అయోధ్యపురికి వెళ్లారు.

Recommended Video
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు.. అక్కడినుంచి హెలికాప్టర్లో అయోధ్య చేరుకుంటారు. సాకేత్ కాలేజీ హెలిప్యాడ్లో మోడీ హెలికాప్టర్ ల్యాండ్ అవుతోంది. అక్కడినుంచి ప్రత్యేక కాన్వాయ్లో రామాలయం భూమి పూజ స్థలానికి చేరుకుంటారు. భూమి పూజ తర్వాత ప్రధాని మోడీ ప్రసంగించారు. మోడీతోపాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, రామమందిర ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాల్ దాస్, యూపీ గవర్నర్ ఆనిందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ వేదికను పంచుకోబోతున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications