పాట పాడలేదని మహిళా సింగర్ను తుపాకీతో కాల్చేశాడు
లక్నో: ఆర్కెస్ట్రా కార్యక్రమంలో కోరిన పాట పాడలేదని ఓ గాయకురాలిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చౌబీస్ పరగణ జిల్లాకు చెందిన 23 ఏళ్ల పియూ అనే ఆర్కెస్ట్రా గాయకురాలు ఉన్నారు.
ఆమె బలియాలోని దయా చాప్రా గ్రామంలో ఓ వివాహ కార్యక్రమంలో పాడేందుకు వచ్చారు. అయితే, అభిమానులు కోరిన పాటను పాడటానికి నిరాకరించింది.
దీంతో ఆగ్రహించిన బబ్లూ కుమార్ సింగ్ అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఆమెను తుపాకీతో కాల్చి చంపాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పియూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారులోని బాటసింగారం వద్ద ఓ ట్రావెల్స్ బస్సు ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.