గాలిలో విమానం, చుక్కలు చూపించిన ఎలుక
న్యూఢిల్లీ: గాలిలో హాయిగా వెలుతున్న విమానంలో ఒక ఎలుక సందడి చేసింది. విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది హడలిపోయారు. అసలు విషయం తెలియకపోవడంతో కొందరు విమాన ప్రయాణికులు ఎలుక చేస్తున్న చేష్టలకు నవ్వుకున్నారు.
తీరా విమానం వెనక్కి తిరిగి రావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. గురువారం న్యూఢిల్లీ నుండి ఏయిర్ ఇండియా విమానం ఏఐ-123 యూరప్ లోని మిలాన్ నగరానికి బయలుదేరింది. విమానం బయలుదేరిన కొన్ని గంటల తరువాత క్యాబిన్ లో ఎలుక దర్శనం ఇచ్చింది.
విమాన సిబ్బంది, ప్రయాణికులు ఎలుకను గుర్తించారు. ఎలుక గురించి తెలుసుకున్న పైలెట్ లు విమానం కిందకు దింపడానికి ప్రయత్నించారు. అయితే విమానం అప్పటికే పాకిస్థాన్ మీదుగా వెళుతోంది. పైలెట్ లు న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించారు.

న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు విమానం వెనక్కి తీసుకురావడానికి అనుమతి ఇచ్చారు. గాలిలో ఉన్న విమానంలోని వైర్లను ఎలుక కొరికితే గాలిలోనే ప్రాణాలు పోతాయని విమాన సిబ్బంది హడలిపోయారు. విమానంలో మొత్తం 200 మంది ప్రయాణికులు ఉన్నారు.
విమానం క్షేమంగా తిరిగి వచ్చి న్యూఢిల్లీలో ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. పార్శిల్ వాహనాల నుండి ఎలుక విమానంలోని క్యాబిన్ లోకి వెళ్లి ఉంటుందని ఎయిర్ పోర్టు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications