‘భగవద్గీతను పాఠ్యాంశాల్లో చేర్చే ప్రతిపాదన లేదు’
న్యూఢిల్లీ: భగవద్గీత, వేదాలు తదితర మత గ్రంథాలను పాఠ్య ప్రణాళికల్లో చేర్చే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోమవారం లోక్సభకు రాతపూర్వక సమాధానమిచ్చారు.
ప్రతిపాదిత నూతన విద్యావిధానం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని ఆమె చెప్పారు.విధాన రూపకల్పనకు వివిధ మార్గాల్లో అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి తెలిపారు.
కేంద్రీయ విద్యాలయాల్లో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు జర్మన్ భాషను అదనపు పాఠ్యాంశంగా నేర్చుకోవచ్చని మరో ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు.

భూసేకరణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం తన నివేదికను సమర్పించడానికి గడువును పెంచుతున్నట్లు ప్రతిపక్ష సభ్యుల నిరసనల నడుమ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
శీతాకాల సమావేశాలు ముగిసే రోజున నివేదిక సమర్పించవచ్చని చెప్పారు. దీని ప్రకారం భూసేకరణ బిల్లుపై బడ్జెట్ సమావేశాల్లోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications