యూపీలో మహిళలకు రక్షణ కరువు.. బాబా సీఎంను సాగనంపాల్సిందే : అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ బరితంగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్షాల మధ్య మాటల దాడి పెరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో హీటెక్కిస్తున్నారు. బీజేపీ నేతల ఆరోపణలకు సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కౌంటర్ ఇస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ పాలనలో అమాయకులు బలవుతున్నారని విమర్శలు గుప్పించారు. ఏ ఒక్కరికి రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.

అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా యూపీ..
యూపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మారిందని విమర్శించారు. మూడో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలౌన్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.

మహిళలకు రక్షణ కరువు
గణంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహిళలకు రక్షణలేని రాష్ట్రంగా నిలిచిందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. రెండు రోజుల కిందట ఓ బాలిక తప్పిపోయింది. ఈ రోజు ఆ చిన్నారి శవమై కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపానికి ఎవరు బాధ్యతవహిస్తారని నిలదీశారు. బాబా ముఖ్యమంత్రి బాధ్యతవహిస్తారా అని సీఎం యోగిని ఉద్దేశించి ప్రశ్నించారు.
Recommended Video

రైతుల భూములపై బీజేపీ కన్ను
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిందని అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి వ్యతిరేకంగా పోరాడిన 750 మంది రైతులు మృతి చెందారని పేర్కొన్నారు. ఇంతమంది రైతుల చావుకు బీజేపీయే కారణమని మండిపడ్డారు. మరోసారి రాష్ట్రంలో కాషాయ పార్టీ అధికారంలో వస్తే నల్ల చట్టాలను మరోసారి తీసుకొచ్చి మీ భూములను అమ్ముకుంటుందని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నప్పటికీ ఆ పార్టీని రైతులు నమ్మడం లేదని అఖిలేష్ విమర్శించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications