చత్తీస్గఢ్లో రెచ్చిపోయిన మావోలు... ఎస్పీ నేత కిడ్నాప్..హత్య
చత్తీస్గఢ్లో మావోయిస్ట్లు రెచ్చిపోయారు. సమాజ్వాది పార్టీ నేతను మంగళవారం రాత్రీ కిడ్నాప్ చేశారు. అనంతరం ఆయన్ను కాల్చి చంపారు. అనంతరం ఆయన శవాన్ని ఇచ్చేందుకు కూడ నిరాకరించారు మావోయిస్టులు. ఆయన కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్న మరిమల్ల గ్రామం నుండి కిడ్నాప్ చేశారు.
చత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన సంతోష్ పూనమ్ సమాజ్వాది రాష్ట్ర్ర ఉపాధ్యాక్షుడిగా పనిచేయడంతో పాటు గత ఎన్నికల్లో బీజాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటి చేసి ఓడిపోయాడు. కాగా సంతోష్ పూనమ్ కాంట్రాక్టర్గా కూడ ఉన్నాడు. దీంతో ఆయన్ను మంగళవారం రాత్రీ కిడ్నాప్ చేశారు. అనంతరం కాల్చి చంపారు. దీంతో ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న సంతోష్ పూనమ్ను స్థానిక ప్రజలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు హత్య చేసిన అనంతరం ఆయన శవాన్ని కుటుంభ సభ్యులకు కూడ ఇచ్చేందుకు మావోయిస్టులు నిరాకరించారు.
Recommended Video
కాగా సంఘటన స్థలంలో సంతోష్ పూనమ్కు చెందిన బొలేరో తోపాటు మూడు ట్రక్కులను కాల్చి వేశారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం బీజాపూర్ పోలీసు స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరం ఉన్నట్టు బీజాపూర్ పోలీసులు తెలిపారు.