విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీగా ఈదురు గాలులు.. కుదునకు గురైన ప్లైట్, 40 మందికి..
స్పైస్ జెట్ విమానంలో ఒక కుదుపునకు గురయ్యింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో గల గుర్గాపూర్ నజ్రుల్ ఇస్లాం ఎయిర్ పోర్టులో జరిగింది. అయితే అక్కడ ల్యాండ్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో క్యాబిన్ లాగేజీ ఫ్లైయర్స్పై పడింది. దీంతో విమానంలో ఉన్న 40 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం విమానం ఆకాశంలో ఉండగానే జరిగింది. గాయపడ్డవారిలో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. చిన్న గాయాలు కావడంతో మరో 30 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 10 మంది క్రిటికల్గా ఉందని.. కానీ వారి ప్రాణానికేం ప్రమాదం లేదని చెప్పింది.
ఘటనకు సంబంధించి విచారణ జరుగుతుంది. వాతావరణం బాగోలేకున్నా విమానం దిగేందుకు ఎలా అనుమతి ఇచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నారు. విమానం ఆండాల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో ఘనట జరిగింది. ఈదరుగాలులకు విమానం తడబడింది. దీంతో క్యాబిన్ సామాగ్రి ప్రయాణికులపై పడింది.
విమానం ల్యాండే సమయంలో మూడు సార్లు జర్క్ ఇచ్చిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కారు బంపర్ను ఢీ కొనే సమయంలో జరిగినట్టు.. జరిగిందని వివరించారు. కారు మరో కారు బంపర్ను ఢీ కొనే ఫీలింగ్ కలిగిందని చెప్పారు. సీటు బెల్ట్ పెట్టుకున్నామని.. కానీ తాకిడికి చిరిగిపోయాయని చెప్పారు.